జాన్ టైటిల్ తో ప్రభాస్ న్యూ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని మార్చబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. శర్వానంద్, సమంత న్యూ మూవీ వల్ల ఆడియన్స్ కన్ ఫ్యూజ్ అయ్యే ఛఆన్స్ ఉందని.. అందుకే  ప్రభాస్ జాన్ అనే టైటిల్ మార్చాలని భావిస్తున్నట్టు టాక్.

 

సాహో మూవీ తర్వాత ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కొత్త సినిమాను పట్టాలెక్కించాడు. జాన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ కొత్త చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ మార్చాలని యూనిట్ ఆలోచన చేస్తున్నట్టు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

 

శర్వానంద్, సమంత జంటగా దిల్ రాజు నిర్మాణంలో జాను అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ సినిమా తమిళ క్లాసిక్ హిట్ 96కి రిమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ వల్లే ప్రభాస్ జాన్ సినిమా టైటిల్ మార్చాలని యూనిట్ భావిస్తుందట. 

 

ప్రభాస్ జాన్, శర్వానంద్ జాను టైటిల్స్ దగ్గరదగ్గరగా ఉండటంతో ఆడియన్స్ కన్ ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే జాన్ టైటిల్ ను మార్చాలని ప్రభాస్ అండ్ టీమ్ ఆలోచిస్తుందట. శర్వానంద్, సమంత  జంటగా నటిస్తున్న జాను వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ప్రభాస్ మూవీ ఈ ఏడాది చివరలో రిలీజయ్యే అవకాశాలున్నాయి. మరి ప్రభాస్ జాన్ టైటిల్ మారుస్తారా.. లేక అదే టైటిల్ కంటిన్యూ చేస్తారా తెలియదు కానీ.. టైటిల్ ఛేంజ్ మాత్రం ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: