మన తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకులు చాలామందే ఉన్నారు. కానీ తమకంటూ ఒక బ్రాండ్..ఐడెంటిటి, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ తెచ్చుకునేవాళ్ళు మాత్రం చాలా తక్కువమందే కనిపిస్తారు. అలాంటివాళ్ళలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. మాటల మాంత్రికుడు.. గురూజీ లాంటి వంటి బిరుదులు కూడా ఆయనకే సొంతం అయ్యాయి.  ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' ఈ సంక్రాంతికి గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. దీంతో 'అల వైకుంఠపురములో' టీమ్ హమ్మయ్యా అంటూ సంతోషంగా ఊపిరి పీల్చుకుంది.

 

ఇక అనూహ్యంగా ఒక సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు ఫిలిం యూనిట్ అంతా ఉన్నదో లేదా హీరో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతారు. అయితే ఈసారి 'అల వైకుంఠపురములో' టీమ్ ఏకంగా త్రివిక్రమ్ థ్యాంక్ యూ చెప్తున్నట్టుగా ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో గురూజీ ఓ రాజకీయనాయకుడి మాదిరిగా రెండు చేతులు జోడించి ప్రేక్షకదేవుళ్లకు నమస్కారం పెడుతూ ఉన్నారు. పోస్టర్ పై 'థ్యాంక్ యూ ఆల్' అన్న ట్యాగ్ ని ఇచ్చారు. అంతేకాదు ఈ పోస్టర్ లోనే ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే ఈ పోస్టర్ విషయంలో అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్స్, సెటైర్లు కూడా పడుతున్నాయి.

 

త్రివిక్రమ్ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారని.. స్టార్ హీరోల లాగా పోస్టర్లతో ప్రచారం మొదలు పెట్టారని కామెంట్ చేస్తున్నారు. హీరోలకు ప్రమోషన్స్ అనేది చాలా అవసరం. ఎప్పుడూ లైమ్ లైట్ లోనే ఉంటూ ప్రేక్షకులకు దగ్గరా ఉండాలి. వాళ్ళతో రిలేషన్ మేయిన్‌టేయిన్ చేస్తుండాలి. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా ఏదో ఒక పోస్టర్ వేసి సోషల్ మీడియాలో టచ్ లో ఉంటారు. కానీ దర్శకులకు అలాంటి ప్రచారం అవసరం ఉండదు. అయినా ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం త్రివిక్రమ్ సెల్ఫ్ ప్రమోషన్ మొదలు పెట్టారనే అంటున్నారు. మరి ఈ సెల్ఫ్ ప్రమోషన్ ఈ పోస్టర్ తోనే ఆగుతుందా ఇకపై కూడా కంటిన్యూ చేస్తారా అంటూ చెప్పుకుంటున్నారు. అంతేకాదు సరిలేరు తో పోల్చుకుంటూ నాకు నేనే పోటీ నాకు నాతోనే పోటీ అంటున్నట్టుగా కూడా ఈ పోస్టర్ చూస్తుంటే అనిపిస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: