సంక్రాంతి పండ‌గ అంటేనే అంద‌రికి పెద్ద పండ‌గ. చిన్న‌వాళ్ళ నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అంద‌రూ ఎంతో గ్రాండ్‌గా ఆనందంగా మూడు రోజుల పాటు జ‌రుపుకునే పండ‌గ ఇది. ఇక ఈ రోజు భోగి పండ‌గ‌ను ప్ర‌తి ఒక్క‌రు జ‌రుపుకున్నారు. అంతే కాక వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ... ఫ్యాన్స్‌కి క‌నువిందు చేశారు.  వీరిలో  రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక, సుష్మీత, వరుణ్ తేజ్ ఇలా చాలా మందే ఉన్నారు.

 

అలాగే హీరో రామ్ చ‌ర‌ణ్, వ‌రుణ్‌తేజ్‌, నిహారిహా, సుష్మితా వీళ్ళంతా ప్ర‌తి ఏటా సంక్రాంతికి బ‌య‌ట‌కు వెళ్ళి చాలా ఆనందంగా గ‌డుపుతారు. ఈ సారి సంక్రాంతికి మెగా ఫ్యామిలీ ఓ రేంజ్‌లో సెల‌బ్రేట్ చేసుకుంద‌నే చెప్పాలి. ఇక హీరో వెంక‌టేష్ అయితే త‌న ఇంటి ముందే భోగి మంట‌లు పెట్టి ఆ వీడియోని సోష‌ల్‌మీడియా వేదిక‌గా అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు.

 

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి క‌ళ్యాణ్‌రామ్ కూడా ట్విట‌ర్ వేదికగా త‌మ అభిమానుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపారు. అదేవిధంగా అక్కినేని నాగార్జున కూడా త‌మ అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక మంచు ఫ్యామిలీ నుంచి మంచు ల‌క్ష్మి కూడా ఆక‌ర్షించే మంచి వంకాయ రంగు ప‌ట్టుచీర క‌ట్టుకుని త‌న కుమార్తెతో క‌లిసి ఉన్న ఒక ఫొటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపింది. "కొత్తగా ప్రారంభించడానికి ఒక శుభ దినం, భోగ భాగ్యాలను అందించే పర్వదినం. మీ కుటుంబం సిరిసంపదలతో సుసంపన్నంగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ భోగి శుభాకాంక్షలు." అంటూ ఓ మంచి కొటేష‌న్ ఇస్తూ... పోస్ట్ చేశారు. ఇలా ఒక్కొక్క‌రు ఒక్కోలా ఎంతో ఆనందంగా వారి వారి కుటుంబ స‌భ్యుల‌తో ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: