టాలీవుడ్ లో కొన్ని జంటలు తెరపై కనిపిస్తే.. కనుల విందుగా ఉంటాయి. అలాంటి జంటల్లో ఒకరు అల్లు అర్జున్, పూజా హెగ్డె. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ ఈ జంట మొదటిసారిగా కనిపించారు. వాస్తవానికి పూజా హెగ్డే ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ మూవీలో నటించింది. కానీ ఆ మూవీస్ తో పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ మూవీలో బికినీ సీన్లో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస ఛాన్సులు వచ్చాయి. ఎన్టీఆర్, మహేష్ బాబు, వరుణ్ తేజ్ తో నటించింది. తాజాగా మరోసారి త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో’ నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ సంబరాల్లో మునిగిపోయారు.
అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 80 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిందని చిత్ర బృందం చెబుతోంది. తాజాగా నటి పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తొలి సినిమాలో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందట. ఇదే విషయాన్ని పూజా తాజాగా వెల్లడించింది. `మేం ఇప్పటి వరకు రెండు మూవీలో కలిసి నటించాం. మా మధ్య సెట్స్పై కంఫర్ట్ లెవెల్ పెరిగింది. అది తెరపై కెమిస్ట్రీ రూపంలో కనిపించింది. అందుకే మా మధ్య కెమిస్ట్రీ బాగుందని అంతా అంటున్నారు.
'అల..వైకుంఠపురములో' ని అమూల్య పాత్రతో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారు. తాజాగా బన్నీగారు థ్యాంక్స్ మీట్లో నాతో కలిసి నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. ఆయన అన్నట్టుగానే ఇద్దరం కలిసి మరో సినిమాకు పనిచేయాలని ఆశిస్తున్నాను.