చిన్న సినిమాల నుండి పెద్ద సినిమా ల వరకు అన్నీ సినిమాలు చాలా వరకు సురేష్ ప్రొడక్షన్ మీద తెరకెక్కుతున్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.. అందుకే ఈ సినిమా హిట్ అవుతున్నాయని చిత్ర అభిమానులు అంటున్నారు.. అంతేకాకుండా కొత్త సినిమాల తో కొత్త ప్రయోగాలు చేస్తుంటారు..అందుకే సినిమా హిట్ అవుతున్నాయి..
కొరియన్ సినిమా మిస్ గ్రానీకి రీమేక్ గా తెరకెక్కిన ఓ బేబీతో సూపర్ హిట్ అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు మరో కొరియన్ సినిమా రీమేక్ మీద కన్నేసింది. పోలీసుల ట్రైనింగ్లో ఉన్న ఇద్దరు యువకుల కథ తో తెరకెక్కిన మిడ్ నైట్ రన్నర్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది ఈ సంస్థ. పోలీష్ అకాడమీలో ట్రైనింగ్ లో ఉన్న ఇద్దరు యువకులు అత్యుత్సాహం తో ఓ కిడ్నాప్ కేసును పరిష్కరించేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడటం ఈ సినిమా కథ.
వివరాల్లోకి వెళితే.. ఇప్పుడు ఇదే సినిమా ను తెలుగు లో రీమేక్చేసే ఆలోచన లో ఉన్నారు.అసలు విషయానికొస్తే.. ఒరిజినల్ సినిమా లో ఇద్దరు అబ్బాయి నటిస్తే ఈ సినిమా లో మాత్రం ఇద్దరు అమ్మాయిలు నటించనున్నారని సమాచారం..ఇలా ఓ కిడ్నాప్ కేసు పరిష్కరించేందుకు ప్రయత్సిస్తున్నట్టు గా మార్చారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ప్రారంభమైనట్టు గా తెలుస్తోంది. ప్రధాన పాత్రలకు రెజీనా, నివేదా థామస్ల పేర్లను పరిశీలిస్తున్నారట.
అంతేకాదు ఈ సినిమాకు సుధీర్ వర్మ అయితే దర్శకుడిగా పర్ఫెక్ట్ అన్న ఆలోచన లో నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. స్వామి రారా, కేశవ, రణరంగం లాంటి థ్రిల్లర్లను తెరకెక్కించి న సుధీర్, ఈ సినిమాను పర్ఫెక్ట్ హ్యాండిల్ చేయగలడని భావిస్తున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వర లో అధికారిక ప్రకటన వెలువడనుంది...మరి ఈ సినిమా ఈ రేంజులో హిట్ అవుతుందో చూడాలి..