ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ సాధించింది పూజా హెగ్డే. అల్లు అర్జున్ తో పూజా గతంలో డీజే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో అందంతో పాటుగా అభినయంతో కూడా ఆకట్టుకుంది. అందులో వేసిన బికినీతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఈ అవకాశాలు రావడంతో ఈ అమ్మడు వరుసగా దూసుకుపోతున్నది. ఈ స్టార్ హీరోయిన్ బన్నీతో కలిసి మరోసారి అల వైకుంఠపురంలో సందడి చేసింది.
ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుతం ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తున్నది. అయితే, ఈ సినిమా విజయం తరువాత పూజా హెగ్డే కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నది. తెలుగు హీరోలు, మేనేజర్లతో కలిసి తాను పనిచేయడం వలన తెలుగు మాట్లాడగలుగుతున్నట్టు చెప్పింది. డబ్బింగ్ చెప్పే సమయంలో కొన్ని ఇబ్బందులు పడినట్టుగా చెప్పింది.
అంతేకాదు, బన్నీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, బన్నీకి వర్క్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ప్రభాస్ నైస్ పర్సన్ అని, అతనితో కలిసి పనిచేయడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పింది. అయితే, అరవింద సమేత సినిమా హీరో ఎన్టీఆర్ గురించి, మహర్షి సినిమా హీరో మహేష్ గురించి మాత్రం ఒక్కమాట కూడా చెప్పకపోవడం విశేషం. సెట్స్ లో ఎన్టీఆర్ చాలా జోవియల్ గా ఉంటాడు. వర్క్ పట్ల డెడికేషన్ గా ఉంటాడు.
ఇండస్ట్రీ గురూజీగా పిలిచే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఎన్టీఆర్ టైమ్ సెన్స్ కు ఫిదా అయ్యాడు అంటే అర్ధం చేసుకోవచ్చు. మరి పూజా ఎన్టీఆర్ గురించి ఎందుకు చెప్పలేదో. అంతే కాకుండా టాలీవుడ్ నెం వన్ హీరోగా మహేష్ బాబు కొనసాగుతున్నాడు. మహేష్ డైరెక్టర్ల హీరో.. డైరెక్టర్స్ కు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు.. వంశీ పైడిపల్లితో చేసిన మహర్షి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నవిషయం తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్ కూడా పూజానే. ఒక విధంగా చెప్పాలంటే పూజా కెరియర్ ను దారిలో పెట్టింది ఎన్టీఆర్, మహేష్ సినిమాలే అలాంటిది ఈ ఇద్దరు హీరోలను మర్చిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పూజా పై విమర్శలు చేస్తున్నారు.