రానా దగ్గుబాటి ...శేఖర్ కమ్ముల ఒక డిఫ్రెంట్ జోనర్ లో తెరకెక్కించిన లీడర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమా నటుడిగా రానా కు మంచి హిట్ ని ఇవ్వకపోయినా ఎంట్రీ మాత్రం బావుంది. ఆ కటౌట్ చూసి బాలీవుడ్ హీరోలా ఉన్నాడని అందరు అన్నారు. అందుకు తగ్గట్టే ఇటు టాలీవుడ్ లో నటిస్తూనే అటు బాలీవుడ్ లోను సినిమాలు చేస్తున్నాడు. ఇక రానా కెరీర్ లో ఇప్పటి వరకు ఘాజీ వంటి డిఫ్రెంట్ సినిమా కాకుండా బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమా కూడా ఉండటం విశేషం. ముఖ్యంగా ప్రభాస్ తో పాటు రానా కి ఈ సినిమా అద్భుతమైన పేరును ని సంపాదించి పెట్టింది. ఆ తర్వాత రానా కి సోలో హీరోగా నేనే రాజు నేనే మంత్రి మంచి కమర్షియల్ సక్సస్ ని ఇచ్చింది. 

 

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్.. హృతిక్ రోషన్ కలిసి హీరోలుగా ఒక పౌరాణిక చిత్రం తెరకెక్కనుందట. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం రానా దగ్గుబాటిని సంప్రదించారని.. రానా కూడా వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే ఈ సినిమాకు దర్శకుడు.. నిర్మాత లాంటి ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని లేటెస్ట్ న్యూస్.

 

ఇక ఈ లేటెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్టు సంగతి ఇలా ఉంటే రానా ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి 'హాథి మీరే సాథి' కాగా మరొకటి 'విరాట పర్వం'. ఈ రెండు సినిమాలు కాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ తో రూపొందబోయో సినిమా 'హిరణ్యకశ్యప' సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు రానా కమిటయిన సినిమాలన్ని ఆయన కటౌట్ కి సరిపడే సినిమాలే అని అంటున్నారు. మరి వీటిలో ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా రికార్డ్ క్రియోట్ చేస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: