అక్కినేని నాగార్జున వారసులుగా అక్కినేని నాగ చైతన్య ‘జోష్’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏం మాయ చేసావే మూవీతో మంచి విజయం అందుకున్నాడు. నాగ చైతన్య హీరోగా వెండి తెరకు పరిచయం అయి పదేళ్లు అయ్యింది.. కానీ చెప్పుకోదగ్గ హిట్స్ మాత్రం లేవు. ఏం మాయ చేసావే మూవీలో నటించిన సహ నటి సమంత తో రియల్ లైఫ్ లో ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం జరిగింది. గత ఏడాది ఈ జంట కాంబినేషన్ లో వచ్చిన ‘మజిలీ’ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన మేనమామ విక్టరీ వెంకటేష్ తో నటించిన ‘వెంకిమామ’ మరో హిట్ అందుకుంది. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ పోస్టర్ రిలీజ్ చేశారు.
రెహామాన్ శిష్యుడు ‘పవన్ ’ అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని అందంగా చూపించబోతున్నట్టు సమాచారం. శేఖర్ కమ్ముల ఫ్యామిలీ తరహా సినిమాలు మాత్రమే కాదు.. అందమైన ప్రేమకథ తీస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఆ ఫీల్ ని పోస్టర్ తో కలిగించారు. ఫిదా’ తరువాత మరోసారి సాయి పల్లవిని వెండితెరపై చూపిస్తున్నారు శేఖర్ కమ్ముల. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ఆడియన్స్ లో క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది.
కాగా, ఈ మూవీ ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ మూవీ గనక హిట్ అయితే నాగ చైతన్య హ్యాాట్రిక్ సాధించినట్లే.