'నా పేరు సూర్య...' లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేయటం జరిగింది. దాదాపు ఏడాదిన్నర కు పైగా తర్వాత అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా విడుదల కావటంతో సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించిన ఈ సినిమా త్రివిక్రమ్ మరియు బన్నీ కెరీర్లో హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది. విదేశాల్లో అయితే అల్లు అర్జున్ నటించిన గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సృష్టించింది. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి సక్సెస్ సంబరాలలో మునిగి తేలుతున్నారు.

 

ఇటువంటి తరుణంలో తాజాగా జరిగిన ఓ సక్సెస్ ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆ టైంలో అలా చేసి ఉండకూడదు అల్లు అర్జున్ నువ్వు కొంచెం ఎక్కువ చేసినట్లు లేదా అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు ఆ వీడియోని చూసి. మేటర్ లోకి వెళ్తే 'అల వైకుంఠపురములో' సినిమా చేయకముందు నాపేరు సూర్య ఫ్లాప్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చేసిన కామెంట్ గురించి ప్రస్తావిస్తూ..“నా పేరు సూర్య రిలీజ్ తర్వాత నా నెక్స్ట్ సినిమా గురించి మీరందరూ ఎదురుచూస్తున్నారని తెలుసు. కానీ అది ఇంకా టైమ్ పడుతుంది. మీకు నిజాయితీతో కూడిన హిట్ ఫిల్మ్ ఇవ్వాలని అనుకుంటున్నా.

 

దానికి కొంత టైమ్ ఆలస్యమవుతుంది” అని అర్ధంవచ్చేలా ట్వీట్ చేసాడు బన్నీ. ఆ తర్వాత చేసిన అల వైకుంఠపురములో  సినిమా హిట్ అయిన తర్వాత...ఇటీవల సక్సెస్ మీట్ లో ఆ కామెంట్ గురించి ప్రస్తావిస్తూ..సినిమా రిలీజ్ తర్వాత ఒక నెటిజన్ తనకు పంపిన మెసెజ్ ను భరణి గారు చదువుతారు అని మైక్ ను తనికెళ్ళ భరణికి ఇచ్చాడు. వెంటనే భరణి మైక్ అందుకుని “చెప్పి మరీ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జి” అని చదివి మైక్ తిరిగి బన్నీకి ఇచ్చాడు. నాకు త్రివిక్రమ్ డైలాగుల్లో ఇది బాగా ఇష్టం...అని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు కొంచెం ఓవరాక్షన్ చేసినట్లు ఉంది అని కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: