అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. చలో  సినిమాతో  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ... మొదటి సినిమాతోనే మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది ఈ అమ్మడు. తనదైన నటనతో అందరిని ఆకర్షించింది.. చిలిపి నవ్వు తో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది. అందాల ఆరబోత లేకుండానే తన కెరియర్ లో అద్భుతంగా దూసుకుపోయి  టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది రష్మిక. ఇక తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. 

 

 

 సరిలేరు నీకెవ్వరు సినిమా లో అమాయకపు కొంటెపిల్ల గా నటించింది రష్మిక మందన. ఇప్పుడు వరకు అన్ని సినిమాల్లో  సీరియస్ గా కనిపించిన రష్మిక మందన ఈ సినిమాలో మాత్రం ఎంతో కొంటెతనంతో తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది.కాగా ఈ  సినిమా బంపర్ హిట్ సాధించింది. దీంతో రష్మిక మందన కు మరింత క్రేజ్ పెరిగిపోయింది. వసూళ్ళ పరంగా కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఇకపోతే సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి రష్మిక మందన పై ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది . ఇంతకీ ఆ వార్త ఏంటి అంటే... రష్మిక మందన్న సౌత్  చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటూ వార్త హల్చల్ చేస్తోంది. 

 

 

 ఇక దీనిపై టాలీవుడ్ బ్యూటీ క్వీన్ రష్మిక మందన్న స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత కొంత కాలంగా తన రెమ్యూనరేషన్ పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సౌత్ ఇండియాలోనే తాను ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని రష్మిక క్లారిటీ ఇచ్చింది. తాను చిత్ర పరిశ్రమలో ఇంకా బుడిబుడి అడుగుల వేస్తూన్నాను అంటూ తెలిపింది. నాకు ఇంకా అన్ని విషయాలు తెలియదు నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేవు... నేను చేస్తున్న ప్రతి సినిమాను నా డెబ్యూ  సినిమాగానే అనుకుంటా అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన.

మరింత సమాచారం తెలుసుకోండి: