శేఖర్ కమ్ముల తెరకెక్కించిన డాలర్ డ్రీంస్ నుండి గత సినిమా ఫిదా వరకు తీసిన సినిమాలన్ని సున్నితమన ప్రేమకథలే. తక్కువ బడ్జెట్ తో తీసి మంచి హిట్ ని అందుకుంటాడు. దానికంటే కూడా తన సినిమాలు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తాయన్న మంచి పేరును సంపాదించుకున్నారు. ఇక తన సినిమా చూసిన ప్రేక్షకుల హృదయాలను బాగా హత్తుకుంటాయి. ముఖ్యంగా ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా అక్కినేని నాగ చైతన్య.. సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఈ ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక ప్రేమ కథా చిత్తాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఎన్.సి 19 పేరుతో అక్కినేని అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమాకు అధికారికంగా ఈ మంగళవారం సాయంత్రం టైటిల్ వెల్లడిస్తారని నిర్మాతలు ప్రకటించారు. 

 

ఈ సినిమాకు శేఖర్ కమ్ముల బృందం 'లవ్ స్టోరి' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు ఫలానా టైటిల్ పెడతారని గతంలో ప్రచారం జరిగిన కొన్ని టైటిల్స్ లో ఈ 'లవ్ స్టోరి' కూడా ఒకటి. శేఖర్ కమ్ముల తన సినిమాలకు అధ్బుతమైన టైటిల్స్ ఎంచుకుంటారు. ఈ సినిమాకు అదే పంథా అనుసరించారు. టైటిల్ సింపుల్ గా ఉన్నప్పటికీ సూపర్ క్యాచీగా ఉంది. ప్రతీ ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా టైటిల్ చూస్తుంటేనే ఇది పక్క ప్రేమకథ అని అర్థమవుతుంది. అక్కినేని హీరోలు నాగేశ్వర రావు గారి దగ్గర నుండి అఖిల్ వరకు రొమాన్స్ కు కేరాఫ్ అడ్రెస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైతూ కూడా ప్రేమ కథల్లో చక్కగా ఒదిగిపోతాడు. ఈ సినిమాలో సాయి పల్లవి జోడీ కావడంతో ఖచ్చితంగా మనం ఈ సినిమా మరో అందమైన ప్రేమకథను ఎక్స్ పెక్ట్ చెయ్యవచ్చు. 

 

ఇక ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్.. అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  'ఫిదా' లాంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం.. సాయి పల్లవిని మరోసారి హీరోయిన్ గా ఎంచుకోవడం.. తొలిసారి చైతన్యతో కాంబినేషన్.. ఇలాంటి అంశాలన్నీ ఈ సినిమాపై భారీగా అంచనాలను  పెంచుతున్నాయి. చైతూ కి మజిలీ తర్వాత మరో హిట్ పడటం ఖాయమని అంటున్నారు. అంతేకాదు ఫిదా తర్వాత సాయి పల్లవికి మళ్ళీ సరైన హిట్ దక్కలేదు. ఆ లోటు ఈ సినిమా తీరుస్తుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: