హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘లవ్ స్టోరీ’ అనే పేరును ఖరారు చేసారు శేఖర్ కమ్ముల. హీరో, హీరోయిన్ కలసి ఉన్న పోస్టర్ కి చాలా మంచి రెస్సాన్స్ వచ్చింది. పోస్టర్లో ఫిదాభామ, సాయిపల్లవి, నాగచైతన్య క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంటున్నారు. ఇద్దరూ కళ్ళు మూసుకుని ఫీలయ్యే ఫీలింగ్స్ని పెట్టడంతో ఆ పోస్టర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ప్రేమలో కనిపించే బావోద్వేగాలను పోస్టర్ లో పలికించాడు శేఖర్ కమ్ముల. తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఆ ఫీల్ ని పోస్టర్ తో కలిగించారు శేఖర్ కమ్ముల. పోస్టర్ తో కథను పరిచయం చేయడం లో శేఖర్ కమ్ముల మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది.
నాగచైతన్య , సాయి పల్లవి, శేఖర్ కమ్ముల క్రేజీ కాంబినేషన్కి తగ్గ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. రెహామాన్ స్కూల్ నుండి పరిచయం అవుతున్న ‘పవన్ ’ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ పాటలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చబోతున్నాయని టీం చెబుతుంది.
ఈ చిత్రానికి సంబందించిన లాస్ట్ షెడ్యూల్ పండుగ తర్వాత ప్రారంభం అవుతుంది. సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని టీం అంటుంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది.
ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే సమ్మర్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే మరి.