క్లాస్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువ జంట నాగ చైతన్య, సాయి పల్లవి తొలిసారిగా జతకడుతున్న సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ ని ఖరారు చేసి, నేడు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేసింది ఈ సినిమా యూనిట్. నాగ చైతన్య ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి రోల్ ని కూడా యూత్ ని ఆకట్టుకునేలా డిజైన్ చేసాడట దర్శకుడు శేఖర్ కమ్ముల. సెప్టెంబర్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన ఈ సినిమాను ఇప్పటివరకు పలు సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసిన ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ తొలిసారిగా నిర్మాతగా మారి నిర్మిస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

 

రెండేళ్ల క్రితం వరుణ్ తేజ్, సాయి పల్లవి లతో ఫిదా అనే లవ్ స్టోరీ ని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల, మళ్ళి ప్రస్తుతం చాలా విరామం తరువాత ఈ సినిమా తీస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ లో కూడా సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కాగా పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా ఫిదా మాదిరిగా మంచి హృద్యమైన లవ్ స్టోరీ గా తెరకెక్కుతోందని అంటున్నారు. అలానే శేఖర్ కమ్ముల గత సినిమాల్లో మాదిరిగా ఈ సినిమాలో కూడా ఫ్యామిలీ, ఎమోషనల్ సీన్స్  మంచి హైలైట్ కానున్నాయని అంటున్నారు. 

 

ఇక ఇప్పటికే మజిలీ, వెంకీ మామ వంటి రెండు వరుస సక్సెస్ లతో మంచి జోరు మీదున్న నాగచైతన్య, ఎలాగైనా ఈ సినిమాతో మరొక హిట్ కొట్టి హ్యాట్రిక్ నమోదు చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది. మరి ఫిదా తో మంచి సక్సెస్ ని అందుకున్న శేఖర్ కమ్ముల, ఈ సినిమాతో ఎంతటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: