ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు 11, 12 న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నాయి. అందులో ఒకటి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' , రెండో సినిమా అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'. కలెక్షన్స్ పరంగా రెండు సినిమాలు జోరు మీద ఉన్నాయి. అయితే సెలబ్రిటీల స్పందన మాత్రం 'అల వైకుంఠపురములో' సినిమాకే  అనుకూలంగా ఉందని ఇప్పటికే అర్థమవుతుంది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అల వైకుంఠపురములో' టీమ్ ను ప్రశంసిస్తూ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ లకు అభినందనలు తెలిపారు. తాజాగా దర్శకుడు సుకుమార్ కూడా 'అల వైకుంఠపురములో' చిత్ర బృందం మీద ప్రశంసలు కురిపించారు.

 

అల వైకుంఠపురములో ఒక అందమైన సినిమా అని.. త్రివిక్రమ్ గారు తన సత్తాను మరోసారి చాటారని.. అల్లు అర్జున్ అద్భుతంగా నటించారని.. మ్యూజిక్.. పిక్చరైజేషన్ ..అన్నీ బాగున్నాయని మెచ్చుకున్నారు. అల టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. అంతే కాకుండా అల్లు అర్జున్ ను కౌగలించుకున్న ఫోటోను కూడా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేశారు. అయితే సుకుమార్ మరో సంక్రాంతి సినిమా 'సరిలేరు నీకెవ్వరు' పై ఇప్పటి వరకు స్పందించకపోవడం మహెష్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఫిల్మ్ నగర్ లో ఈ విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. వాస్తవంగా సుకుమార్ 'రంగస్థలం' తర్వాత మహేష్ బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉంది. సినిమా ప్రకటించిన తర్వాత ఆ సినిమా క్యాన్సిల్ అయింది. మహేష్ - సుకుమార్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని టాక్ వచ్చింది. ఆ సమయంలో మహేష్ - సుకుమార్ కు మధ్య గ్యాప్ వచ్చిందని అన్నారు. అంతేకాదు సుకుమార్ తో కమిటయిన మహేష్ ఆయన్ని పక్కన పెట్టి అనీల్ రావిపూడి తో సరిలేరు చేశారు. 

 

ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' పై సుక్కు స్పందించకపోవడం చూస్తుంటే అదే అసలు కారణమని అందుకే ఇంకా ఈ గ్యాప్ ఇక ముందు కూడా కంటిన్యూ అయ్యో అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. 'రంగస్థలం'బ్లాక్ బస్టర్ అయినప్పటికి గతంలో మహేష్ తో సుకుమార్ చేసిన 1 నేనిక్కడినే ఇంకా మనసులో పెట్టుకొనే మహేష్ సుక్కు కి నో చెప్పి ఉంటాడని అనుకుంటున్నారట. మరి ఇందులో వాస్తవం ఏంటనేది మహెష్ గాని, సుకుమార్ గాని ఓపెన్ అయితే గాని క్లారిటి రాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: