గత ఏడాది మజిలి, వెంకి మామ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన
యువ సామ్రాట్ నాగ
చైతన్య ప్రస్తుతం సెన్సిబుల్
డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తన 19వ చిత్రంలో నటిస్తున్నాడు. యూత్ ఫుల్
లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఈచిత్రానికి ముందు నుండి అనుకున్నట్లుగా లవ్ స్టోరీ అనే టైటిల్ నే ఖరారు చేశారు.
సంక్రాంతి కానుకగా ఈ రోజు టైటిల్ తో కూడిన
సినిమా పోస్టర్ ను విడుదలచేశారు. ఈ చిత్రంలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి గా హీరోయిన్ గా నటిస్తుంది. దాంతో క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ,సీనియర్ హీరోయిన్ దేవయాని, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ల పై నారాయణ దాస్ నారంగ్ ,
రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 2న ఈసినిమా విడుదలకానుందని సమాచారం.
ఇక ఈ చిత్రం తో పాటు సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి , నక్సలైట్ పాత్రలో కనిపించనుండగా ఆమె కు జోడీగా
రానా నటిస్తున్నాడు. కాగా
నాగ చైతన్య మాత్రం
లవ్ స్టోరీ తరువాత ఇప్పటివరకు మరో
సినిమా కు సైన్ చేయలేదు. మరి
నాగ చైతన్య ఈసినిమా తో హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి.