ఈ సారి సంక్రాంతి స్టార్ హీరోల మధ్య పోటీ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. మొన్న 11 న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు, 12న  'అల వైకుంఠపురములో' సినిమాతో స్టైలిష్ స్టర్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ కొట్టినట్టయింది. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠపురములో సినిమా వచ్చింది. గతంలో బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలోభినేషన్ లో 'అల వైకుంఠపురములో' మూడో సినిమా కాబట్టి హ్యాట్రిక్ లెక్క సరిపోయింది. మరి సూపర్ స్టార్ మహేష్ ఎలా హ్యాట్రిక్ కొటాడు అని అనుకుంటున్నారా ..! దిల్ రాజు కాంబినేషన్ లో మహేష్ హ్యాట్రిక్ కొట్టాడు. 

 

ఇంతక ముందు మహేష్ బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమా నిర్మించాడు దిల్ రాజు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మహేష్ బాబు తో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మంచి హిట్ ని అందుకుంది. ఆ తర్వాత మళ్ళీ దిల్ రాజు నిర్మాతగా మహేష్ కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చి మంచి సక్సస్ ని అందుకుంది. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు కూడా దిల్ రాజు సహ-నిర్మాతగా వ్యవహరించాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందింది.  ఇక బన్నీ-త్రివిక్రమ్ గురించి అందరికీ తెలిసిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల వైకుంఠపురములో సినిమాతో వీళ్లు మరో సక్సెస్ కొట్టారు. ఇప్పుడీ ఇద్దరు హీరోలు ఒకేసారి డబుల్ హ్యాట్రిక్ పై ప్రకటనలు చేసి ఆసక్తి రేపారు.

 

అల వైకుంఠపురములో థ్యాంక్స్ మీట్ లో మాట్లాడిన బన్నీ.. త్రివిక్రమ్ తో ప్రస్తుతానికి హ్యాట్రిక్ కొట్టానని.. డబుల్ హ్యాట్రిక్ కొట్టడం కోసం ఇకపి కూడా త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తామని ప్రకటించాడు. ప్రస్తుతం ఇది కామా మాత్రమేనని, మరిన్ని హిట్స్ వస్తాయన్నాడు. అటు సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ లో కాస్త అటు ఇటు గా మహేష్ బాబు కూడా ఇలానే రియాక్ట్ అయ్యాడు. దిల్ రాజు ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మరిన్ని సినిమాలు కలిసి చేయాలని వరుసగా హిట్స్ ఇవ్వాలని అన్నాడు. అలా ఈ సంక్రాంతి హీరోలిద్దరూ తమకు కలిసొచ్చిన దర్శకుడు, నిర్మాత తో డబుల్ హ్యాట్రిక్ కొడతామంటున్నారు. మరి తర్వాత ప్రమాణాలు మారతాయా ..లేక ఇలానే కంటిన్యూ అవుతూ సక్సస్ లు అందుకుంటారా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: