యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీయార్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత జూనియర్ ఎవరి దర్శకత్వంలో నటించబోతున్నాడు అనే ప్రశ్నకు చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ అల వైకుంఠపురములో సినిమా విడుదలైన తరువాత తారక్ ఈ సినిమాను, బన్నీని పొగిడేయటంతో తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలోనే మరోసారి నటించబోతున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ సినిమాను హారిక హాసిని చినబాబుతో పాటు ఎన్టీయార్ సోదరుడు, హీరో, నిర్మాత కళ్యాణ్ రామ్ కలిసి నిర్మించబోతున్నట్టు సమాచారం. అల వైకుంఠపురములో సినిమాను చినబాబు, అల్లు అరవింద్ కలిసి నిర్మించగా ఎన్టీయార్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమాకు కూడా కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మించనున్నారు. ఎన్టీయార్ షరతులు పెట్టడం వలనే చినబాబు కళ్యాణ్ రామ్ కు వాటా ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
త్రివిక్రమ్ జూనియర్ కాంబినేషన్లో తెరకెక్కిన అరవింద సమేత బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎన్టీయార్ మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఎన్టీయార్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్సినిమా కథ, కథనాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
2020 సెప్టెంబర్ నెలలో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీయార్ కు ఒక లైన్ చెప్పాడని ఆ లైన్ ఎన్టీయార్ కు నచ్చటంతో త్రివిక్రమ్ కథ, కథనాలు సిద్ధం చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ కావడంతో త్రివిక్రమ్ కు కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినా అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు హిట్ కావడంతో స్టార్ హీరోలందరూ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: