సంక్రాంతి సినిమాల రేసులో స్టార్ సినిమాల హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో రాగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో వచ్చాడు. ఈ రెండు సినిమాలు మంచి టాక్ తో దూసుకెళ్తున్నాయి. ఇక రెండిటిలో అల వైకుంఠపురములో సినిమాకు కొద్దిగా ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. సరిలేరు నీకెవ్వరు కూడా హిట్ టాక్ తో మంచి వసూళ్లు రాబడుతుంది. అయితే మహేష్ కు సూపర్ హిట్లు కొత్తేమి కాదు భరత్ అనే నేను, మహర్షి రెండు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన మహేష్ సరిలేరు నీకెవ్వరుతో కూడా హిట్టు కొట్టి తనకు సరిరారు ఎవ్వరు అని ప్రూవ్ చేసుకున్నాడు. 

 

అయితే ఈ సినిమా కు పోటీగా వచ్చిన అల వైకుంఠపురములో మాత్రం ఇలా ఉంది కాబట్టి నిలబడ్డది అదే వేరేలా ఉంటే కచ్చితంగా రిజల్ట్స్ వేరేలా ఉండేదని చెప్పొచ్చు. సినిమా షూటింగ్ టైమ్ లో త్రివిక్రమ్ బన్ని ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయట.. ఎలాగైనా ఈ మూవీతో హిట్టు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు బన్ని అందుకే ముందునుండి పకడ్బందీ ప్లాన్ తో వచ్చాడు. 

 

అయితే త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా ఓకే అయ్యాక ముందు వేరే కథ అనుకున్నారట. అది కూడా బాగుంది సెట్స్ మీదకు వెళ్దాం అన్నాడట బన్ని. అయితే కొద్దిపాటి అసంతృప్తి చూపడంతో త్రివిక్రమ్ ఈ కథ చెప్పాడట. సెకండ్ హాఫ్ నరేషన్ ఇచ్చినపుడు కాస్త ఎమోషనల్ గా ఫీల్ అయ్యారట. అందుకే దీనికి ఓటేశాడు. బన్ని ఈ నిర్ణయం ఆయనకు కెరియర్ లో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సంక్రాంతికి సరైన సినిమాగా అల వైకుంఠపురములో సెన్సేషనల్ హిట్ సినిమాగా సంచలనాలు సృష్టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: