టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది గొప్ప దర్శకులు వచ్చినా దర్శక రత్న దాసరి నారాయణరావు స్థాయిని అందుకున్న దర్శకులు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో రాలేదు. దాసరి జీవించి ఉన్నరోజులలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ లో దాసరి పేరును ఆ మూవీ పోస్టర్ లో ఆయన పేరును హైలెట్ చేస్తూ అగ్ర స్థానంలో లో ఒ మేఘంలో దాసరి పేరును ప్రింట్ చేసి హైలెట్ చేసేవారు. 

ఆ రోజులలో కేవలం దాసరి పేరును చూసి సినిమాలకు వెళ్ళే ప్రేక్షకులు ఉండేవారు. దాసరి హవా ముగిసిన తరువాత అనేక మందిదర్శకులు   పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఇండస్ట్రీలో టాప్ దర్శకులుగ కొనసాగుతున్నారు. వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు.  

మాటల మాంత్రికుడుగా పేరు గాంచిన   త్రివిక్రమ్ బన్నీల కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని సంక్రాంతి విన్నర్ అయినపరిస్థితులలో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. దీనీతో ‘అల వైకుంఠపురములో' టీమ్ సంతోషంగా ఉంది.

అయితే ఈసినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నందుకు గాను ఈ ఫిలిం యూనిట్ వర్గాలు ఈమూవీ హీరో బన్నీని హైలెట్ చేయకుండా ‘అల వైకుంఠపురములో’ టీమ్ ఏకంగా త్రివిక్రమ్ ప్రేక్షకులకు థ్యాంక్ యూ చెప్తున్నట్టుగా ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసారూ. ఈ పోస్టర్ లో  త్రివిక్రమ్ ఒక రాజకీయనాయకుడి తరహాలో రెండు చేతులు జోడించి ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం పెడుతూపోజు ఇచ్చాడు. అయితీ ఈపోస్టర్ విడుదల అయిన కొద్ది గంటలలోనే  ఆ పోస్టర్ పై సేతోర్లు ప్రారంభం అయిపోయాయి.   త్రివిక్రమ్ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నాడని స్టార్ హీరోల లాగా పోస్టర్లతో ప్రచారం మొదలుపెట్టాడని విమర్శిస్తున్నారు. అంతేకాదు త్రివిక్రమ్ తనకు తాను లెజెండ్ దాసరి స్థాయిలో ఊహించుకుంటున్నాడని ఇండస్ట్రీకి త్రివిక్రమ్ చేసిన గొప్ప పనులు ఏమిటి కోట్లల్లో పారితోషికం తప్ప అని కొందరు జోక్ చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ మొదలుపెట్టిన ఈసెల్ఫ్ ప్రమోషన్ ఈపోస్టర్ తోనే  ఆగుతుందా లేక భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా  అనేవిషయం రానున్న రోజులలో మాత్రమే తెలిసేవిషయం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: