2020 ఓపెనింగ్ ఎవరూ ఊహించని విధంగా అద్భుతంగా మొదలైంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సూపర్ స్టార్ మహేష్.. అల వైకుంఠపురములో సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. చెప్పుకోదగ్గ ఓపెనింగ్ కలెక్షన్లతో శుభారంభం పలికారన్న టాక్ వచ్చింది. సంక్రాంతి బరిలో మహేష్ కి మిక్స్ డ్ టాక్ వినిపించినా బన్నికి పూర్తి పాజిటివ్ టాక్ దక్కింది. సంక్రాంతి సెలవులు కావడంతో ఓపెనింగుల పరంగా ఇద్దరికీ బాగానే ఉంది. రెండు సినిమాలకు ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు దక్కాయి. భోగి-సంక్రాంతి-కనుమ పండగలకు కలెక్షన్లు స్టడీగా ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు రెండు సినిమాలకు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

 

తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ రెండు సినిమాలపై స్పందించారు. ఓపెనర్లు అదరగొట్టారంటూ ప్రశంసించాడు. ఏడాది ఆరంభంలో రెండు పెద్ద సినిమాలు సక్సెస్ అవ్వడం.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్తు రాబడుతుండటం చూస్తుంటే ఈ ఏడాది గొప్పగా ఉంటుందని అన్నాడు. తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలకు ఈ సక్సెస్ లు మోరల్ గా నిలవాలి అని కోరాడు. రెట్టించిన ఉత్సాహంతో సమ్మర్ తర్వాత విడుదలయ్యే సినిమాలు మంచి సక్సస్ లు నమోదు చేయాలని కోరుకున్నాడు. ఈ రెండు విజయాలతో పరిశ్రమ సహా పంపిణీదారులు...ఎగ్జిబిటర్లు సంతోషంగా ఉండాలన్నదే నాని ఈ సందర్భంగా తెలిపాడు.

 

కొత్త వాళ్లు మన సినీ పరిశ్రమకు రావాలంటే ఈ విజయాలే కీలక పాత్ర పోషిస్తాయని నేచురల్ స్టార్ తెలిపాడు.   ప్రస్తుతం నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ 'వీ' సినిమాని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఉగాది కానుకగా మార్చిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యీనిత్ సన్నాహాలు చేస్తున్నారు. 'వీ' లో నాని విలన్ గా పాత్రలో నటిస్తుండగా సుధీర్ బాబు కాప్ రోల్ పోషిస్తున్నారు. నివేదా థామస్, అదిరావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక నాని గత సంవత్సరం నిరశాగానే మిగిలిందన్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: