ఈ సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాల్లోనూ అల వైకుంఠపురములో సినిమాకి మంచి టాక్ వచ్చింది. సరిలేరు నీకెవ్వరు సినిమాకి కూడా మంచి టాకే వచ్చినప్పటికీ పోలిస్తే మాత్రం అల సినిమాకే క్రేజ్ ఎక్కువగా ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమా ఫక్తు మాస్ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడాలని.. అది కూడా పండక్కి ఏదో ఒక సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు మాత్రం అల వైకుంఠపురములో సినిమాని చూడడానికి రెడీ అవుతున్నారు.

 

దాంతో సినిమాకి క్రేజ్ బాగా ఏర్పడింది. ఆ క్రేజ్ వల్ల టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. దీని టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. ఆ డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే.. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసిన అర్లీ మార్నింగ్ షోలను వారమంతా కొనసాగించాల్సిన పరిస్థితి వస్తోంది. సాధారణంగా మార్నింగ్ షోల అనుమతి వారం రోజుల కోసమే తీసుకుంటారు. కానీ మొదటి రోజు తర్వాత సినిమా కి క్రేజ్ అంతగా ఉండదు కాబట్టి అప్పుడు ఆపేస్తారు.

 

కానీ అల సినిమాకి అలా జరగట్లేదు. ఇప్పటికీ మార్నింగ్ షోలు ఫుల్ గా నడుస్తున్నాయి. దీనికి మరో కారణం కూడా ఉంది. సరిలేరు నీకెవ్వరు లాంటి పెద్ద సినిమాలతో థియేటర్లు పంచుకోవాల్సి రావడం వల్ల అల సినిమాకి థియేటర్లు ఎక్కువ అవసరం అయ్యాయి. అందువల్ల మార్నింగ్ షోలకి ఇంకా డిమాండ్ నడుస్తోంది.  అయితే ఆ మార్నింగ్ షోలు కూడా హౌస్ ఫుల్స్ గా నడవడమే విశేషం.

 

మరి ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం రికార్డుల దిశగా పరుగులు పెడ్తోంది.ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డుల వైపుగా దారి తీస్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఆ రికార్డుని అందుకుంటుంద లేదా చూడాలి. అల్లు అర్జున్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడం మాత్రం పక్కా అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: