నటి సంజన బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన ఈ బ్యూటీ తరువాత సర్థార్ గబ్బర్‌సింగ్‌, దండుపాళ్యం లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో బాక్సర్‌, పొడముండమ్‌ సినిమాల్లో నటిస్తోంది. కాగా ఈ మద్య కాలంలో ఎక్కువగా వివాద స్పదమైన పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. కొన్ని రోజుల క్రితం సంజనబాలీవుడ్ నిర్మాతపై దాడి చేయడం సంచలనంగా మారింది.. ఈ విషయాన్ని మరవక ముందే. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.

 

 

అదేమంటే బెంగుళూరులోని ఓ ప్రాంతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చూడటం కోసం తన కారులో బయలుదేరిన సంజన కుదురుగా డ్రైవింగ్ చేయక, ఓ సిగ్నల్ దగ్గర సెల్ఫీ అలాగే వీడియోను కూడా తీసుకున్నారు. సరే తీసుకున్న వరకు బాగానే ఉంది ఎందుకంటే అప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియదు.. అయితే ఈ వీడియోను, దీంతో పాటుగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకే ముంది ఒక్క సారిగా దుమారం లేచింది.

 

 

అసలే ట్రాఫిక్ రూల్స్ చాలా కట్టుదిట్టంగా తయారైన ఈ రోజుల్లో డ్రైవింగ్ చేస్తూ ఫోన్ ని ఉపయోగించిన  వీడియో పోలీసుల కంట్లో పడటంతో వారు  విచారణకి హాజరు కావాలంటూ సంజనకు నోటీసులు పంపించారు.. ఇక ఒక సెలబ్రిటి పట్ల ఇలా ఎందుకు చేశారని పోలీసులను ప్రశ్నించగా సాధారణంగా మామూలు  వ్యక్తులు ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తే జరిమానా విధించి వదిలేస్తామని, కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తులు ఇలా చేస్తే పరిస్థితిని అదుపు చేయలేమని అందువల్లనే విచారణకి  హాజరవ్వాలని నోటీసులు పంపినట్లు వారు తెలిపారు.

 

 

ఇకపోతే ఒక్కోసారి సెలబ్రిటీల అత్యుత్సాహం వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. వారితో పాటు ఉన్నవారికి ప్రమాదాలను కూడా పరిచయం చేస్తుంది. ఏదైన జరగరానిది జరిగితే అమాయకులు బలి అవ్వవలసిన పరిస్దితులు తలెత్తవచ్చు. అందుకే ఒక లిమిట్‌లో జీవించడం బెటర్ అంటున్నారు కొందరు ఈ విషయం తెలిసిన వారు..

మరింత సమాచారం తెలుసుకోండి: