కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా దర్బార్. ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం యావరేజ్ టాక్ తో ముందుకు సాగుతోంది. కాగా సాధారణ ప్రేక్షకులు సహా రజిని ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ దర్శకుడు మురుగదాస్ మాత్రం వారి అంచనాలు అందుకునేలా సినిమా తీయడంలో చాలావరకు విఫలం అయ్యాడని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార కూడా దర్శకుడు మురుగదాస్ పై ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో సూర్య హీరోగా తెరకెక్కిన గజినీ సినిమాలో హీరోయిన్ గా నటించిన నయనతార, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో, హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక ఈ సినిమాలో తన క్యారెక్టర్ కు సరైన గుర్తింపులేదని, అలానే సినిమా మొత్తంలో మంచి ప్రాధాన్యం ఉన్న ఒక్క సీన్ కూడా తనకు లేదని, ఒకరకంగా సినిమాలో రజిని కూతురుగా చేసిన నివేత థామస్ కు మాత్రం మంచి సీన్స్ ఉన్నాయని ఆమె ఇంటర్వ్యూ లో వాపోయినట్లు తెలుస్తోంది. 

 

నిజానికి తనకు కెరీర్ పరంగా మంచి గుర్తింపునిచ్చిన గజినీ తరువాత మురుగదాస్ గారు తీస్తున్న సినిమా కావడం, అలానే సూపర్ స్టార్ రజిని గారు ఈ సినిమాలో హీరో కావడంతోనే తాను ఈ సినిమా ఒప్పుకున్నానని, అయితే ఆయన మాత్రం తనకు ఆశించిన విధంగా కాకుండా ఏ మాత్రం గుర్తింపులేని పాత్ర ఇచ్చారని అంటోందట. అలానే ఆమె ఫ్యాన్స్ కూడా మురుగదాస్ పై సోషల్ మీడియా మాధ్యమాల్లో దర్శకుడు మురుగదాస్ పై ఒకింత విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: