సంక్రాంతికి ప్రకటించిన నాలుగు సినిమాలు ధియేటర్లలోకి వచ్చి సందడి చేస్తున్నాయి. సంక్రాంతి అనే కాకుండా ఏ సినిమా ఎప్పుడు విడుదలై హిట్ అయినా టాప్ హీరోలు, దర్శకులు మెచ్చుకోవటం వారికి ఫోన్లు చేసి అభినందించటం జరుగుతోంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అభినందనలు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల్లో చెప్పటం జరుగుతోంది. ఈ సంక్రాంతికి పోటీపడ్డారు మహేశ్ – అల్లు అర్జున్. అయితే బన్నీ అల.. వైకుంఠపురములో సినిమాకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెస్పాన్స్ మహేశ్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు రావడంలేదని తెలుస్తోంది.

 

 

బన్నీకి విసెష్ చెప్తూ సినిమా విడుదలైన రెండో రోజే రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ నుంచి సోషల్ మీడియాలో మెసేజెస్ వెళ్లిపోయాయి. బన్నీఎన్టీఆర్ బాండింగ్ వెరీ స్పెషల్ గా కనిపించింది. బావా.. థ్యాంక్స్, కలుద్దాం అంటూ వారి సంబాషణ ఆకట్టుకుంది. పవన్ పంపి విసెష్ తో బన్నీ పొంగిపోయి మీ అభినందనలకు ధన్యవాదలు అంటూ రెస్పాన్స్ ఇచ్చాడు. ఇక చరణ్ తో రిలేషనే ఉంది. దర్శకుడు సుకుమార్ కూడా బన్నీ అల.. ను మెచ్చుకుంటూ వారిద్దరూ దిగిన ఫోటోను యాడ్ చేసి మెసేజ్ చేశాడు. కానీ.. వీళ్లలో ఎవరూ కూడా మహేశ్ సరిలేరు నీకెవ్వరు గురించి ఒక్క ట్వీట్ గానీ మెసేజ్ గానీ చేయలేదు. మహేశ్ తో రామ్ చరణ్ కు, ఎన్టీఆర్ మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

 

 

చిరంజీవి నుంచి విసెష్ వస్తాయని చెప్తున్న మహేశ్ కు ఆయన నుంచి ఫోన్ వెళ్లలేదని తెలుస్తోంది. సరిలేరు.. అబౌ యావరేజ్ కావటం పెద్దగా నచ్చకపోవటం వల్లే ఎవరూ రెస్పాండ్ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో లోగుట్టు ఏమిటో ఎవరికీ అర్ధం కావట్లేదు. మొత్తానికి సంక్రాంతి సినిమాలన్నీ ధియేటర్లలో సందడి చేస్తున్నాయి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: