ఈ మద్య కాలంలో టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు  వరుసగా వస్తున్నారు. ముకుంద , ఒక లైలా కోసం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే.   ఆ రెండు మూవీలు పెద్ద సక్సెస్ కాకపోయినా.. తర్వాత అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం మూవీ తో మంచి సక్సె స్ సాధించింది.  దువ్వాడ జగన్నాథం మూవీ   పూజా హెగ్డే కి మంచి అదృష్టాన్ని తీసుకువస్తుంది.  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన   అరవింద సమేత,  మహేష్ బాబు సరసన మహర్షి, వరుణ్ తేజ్ సరసన గద్దలకొండ (వాల్మీకి)  మూవీ లో నటించింది.  ఇలా టాలీవుడ్ లో వరుస హిట్స్ బిజీ హీరోయిన్ గా మారింది. 

 

తాజాగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురం లో పూజ తన గ్లామర్ తో ఆకట్టుకుంది.  ప్రస్తుతం ప్రభాస్ ఈ మూవీలో బిజీగా ఉన్న పూజ హెగ్డే బాలీవుడ్  సీనియర్ హీరో వినోద్ మెహ్రా తనయుడు రోహ‌న్ వినోద్ మోహ్రాతో డేటింగ్ చేస్తున్న‌ట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి.  2018లో వచ్చిన బ‌జార్ మూవీతో లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన రోహ‌న్ త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆ సమయంలోనే ఈ జంట ప్రేమలో పడ్డట్టు సమాచారం.  టాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకున్న ఈ అందాలభామ అల వైకుంఠపురములో మూవీ తో మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.   

 

ప్రస్తుతం పూజ హెగ్డేప్రభాస్ నటిస్తున్న  మూవీలో నటిస్తుంది. ఆ తర్వాత అఖిల్ అక్కినేని తో మరో మూవీలో నటిస్తుంది.  ఇక ఈ విషయంలో నిజమెంత, అబద్ధమెంత? అన్న విషయం వారిద్దరిలో ఎవరో ఒకరు నోరు మెదిపితేనే తెలుస్తుంది. సాధారణంగా టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటున్న సమయంలో హీరో, హీరోయిన్లపై ఇలాంటి పుకార్లు రావడం సహజం.  కాకపోతే ఈ రూమర్లపై పూజా కూడా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: