నందమూరి ఫ్యామిలీ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి గత ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో ఆయన హీరోగా నటిస్తున్నారు. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ మొన్న డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచింది. ఇకపోతే నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా సినిమా ఎంత మంచివాడవురా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్యాణ్ రామ్ ఒక డిఫరెంట్ రోల్ లో నటించిన ఈ సినిమాకు కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. 

 

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమా తొలి షో నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని అంటున్నారు. శత‌మానంభ‌వ‌తి వంటి మంచి కుటుంబ కథా చిత్రాన్ని తీసి జాతీయ అవార్డు కూడా గెలుచుకున్న దర్శకుడు సతీష్, ఈ ఎంత మంచివాడవురా సినిమాతో ఆ అంచ‌నాలను అందుకోవడంలో చాలావరకు విఫలం అయ్యాడని, అలానే సినిమాలో సాగె బోరింగ్ క‌థ‌, క‌థ‌నాలు, సీరియల్ ను తలపిస్తాయని అంటున్నారు. హీరో కళ్యాణ్ రామ్ తో పాటు ముఖ్య పాత్రధారులైన సుహాసిని, శరత్ బాబు, హీరోయిన్ మెహ్రీన్, విజయ్ కుమార్, ప్రియదర్శి వంటి వారి నటన బాగున్నప్పటికీ, సినిమా కథనాన్ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తీయడంలో దర్శకుడు శ్రద్ధ పెట్టలేదని చెప్తున్నారు. 

 

సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన సాంగ్స్ బాగున్నాయని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ బాగున్నా, సెకండ్ హాఫ్ లో బాగా సాగతీత సన్నివేశాలు, పెద్దగా ఆకట్టుకోని క్లైమాక్స్ ఎపిసోడ్, రొటీన్ డ్రామా వంటివి సినిమాకు దెబ్బేసాయని అంటున్నారు. ఈ విధంగా ఇప్పటికే బాలయ్య నుండి వచ్చిన రూలర్, ఇప్పుడు కళ్యాణ్ రామ్ నుండి ఎంత మంచివాడవురా సినిమాలు వరుసగా అపజయాలు మూటగట్టుకుని నందమూరి అభిమానులను నిరాశకు గురిచేశాయని చెప్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: