మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా కలిసి ఓ చోట చేరితే ఆ సందడే వేరుగా ఉంటుంది. చిన్నా, పెద్దా అందరూ కుటుంబాలతో కిలసిమెలసి చేసుకునే ఏ సందడైనా చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటాయి. మెగా అభిమానులకు ఇలాంటి సందర్భాలు చిరంజీవి సినిమా రిలీజ్ అయినంత సంబరపడతారు అనడంలో సందేహం లేదు. అటువంటి సందడే ఈ సంక్రాంతికి కూడా మెగా ఇంట జరుగుతోంది. ఇప్పటికే నిన్నటి భోగి సంబరాలను, చలిలో భోగి మంటల వెచ్చదనాన్ని కలిసి జరుపుకున్నారు. ఆ పిక్స్ నిన్నంతా సోషల్ మీడియాలో హోరెత్తిపోయాయి.

 

 

నేడు మకర సంక్రాంతి సందర్భంగా కూడా వీరంతా చిరంజీవ ఇంట్లో పండగ సంబరాలను జరుపుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. చిరంజీవి తన ఫ్యామిలీలోని యంగర్ జనరేషన్ తో దిగిన ఈ ఫొటో చూసేందుకు ఎంతో బాగుంది. ఈ పిక్ ను మెగా ప్రిన్స్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్గ్ చేశాడు. దీంతో ఈ పిక్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. మెగా ఫ్యామిలీ హీరోలందరినీ కలిపితే ఓ ఇండియన్ క్రికెట్ టీమ్ అవుతుంది అనే సినీ నానుడిని ఈ పిక్ రుజువు చేస్తోంది.

 

 

ఈ పిక్ లో పవన్ కల్యాణ్రేణు దేశాయ్ ల తనయుడు అకీరానందన్ కూడా ఉండటంతో మరింత స్పెషల్ గా మారింది. మెగాభిమానులందరూ ఈ పిక్ ను బాగా వైరల్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పిక్ లో చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కల్యాణ్ దేవ్, అకీరా నందన్ లతో నిండుగా ఉందనే చెప్పాలి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Wishing you all a very happy sankranti!

A post shared by varun Tej Konidela (@varunkonidela7) on

మరింత సమాచారం తెలుసుకోండి: