పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా టబు , జయరాం , మురళి శర్మ , సునీల్ , హర్ష వర్ధన్ ,నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు. ఇక బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన
జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి సూపర్ హిట్లు కాగా ఇప్పుడు అల... వైకుంఠపురములో
తో ఈజోడి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.