శ్రీరామ్, రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రల్లో జె. పార్థీబన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గర్జన. దేవ్ గిల్, నైరావైష్ణవి, చంద్రన్ మీనన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మోషన్ టీజర్ రిలీజ్ అయ్యి ఇప్పటికే ప్రేక్షకులను బెదరకొట్టేసింది.. పులి బ్యాక్ డ్రాప్ లో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ బయపెట్టేస్తుంది..
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈరోజు సంక్రాంత్రి సందర్భంగా విడుదలయ్యి అందరిని ఆకట్టుకుంటుంది. జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై ఈ థ్రిల్లర్ మూవీ 'గర్జన' తెరకెక్కుతుంది. కొత్తగూడెం తూర్పు అటవీ ప్రాంతంలో 45 ఏళ్ల వ్యవసాయ కూలీని పులి చంపిందనే మాటతో మొదలైన ఈ టీజర్ చాలా ఉత్కంఠంగా సాగింది.
ఆ పులిని పట్టుకునే అటవీ అధికారిగా శ్రీరామ్, అతని భార్యగా రాయ్ లక్ష్మీ ఈ సినిమాలో కనిపించారు. టీజర్లో పులి షాట్స్ చూస్తే వణుకు పుట్టించేలా ఉన్నాయి. ఈ సినిమాలో అంత కూడా 'మనిషి, జంతువులలో ఎవరు ఎక్కువ ప్రమాదకరమో చూపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధిచి మోషన్ టీజర్ విడుదల అయినప్పుడే..
నిర్మాత ఎం.నరేష్జైన్ మాట్లాడుతూ.. ''ఆహారం, రక్షణ కోసమే జంతువు దాడిచేస్తుంది. మనిషి దాడి చేయడానికి కారణాలు అవసరం లేదనే పాయింట్తో రూపొందుతున్న చిత్రమని.. ఓ చిన్నారి, పులి, యువతి మధ్య సాగే కథ అని.. మనిషికి మృగానికి జరిగే పోరాటంలో గెలుపెవరిదనేది ఉత్కంఠను పంచుతుంది అని, విఎఫ్ఎక్స్లో సృష్టించిన పులి నేపథ్యంలో వచ్చే గ్రాఫిక్స్ సన్నివేశాలు అలరిస్తాయి'' అని చెప్పారు. కాగా ఈ టీజర్ చుసిన ప్రతిఒక్కరికి సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూద్దామా ? అనే ప్రశ్న ఖచ్చితంగా మొదలవుతుంది.