సాధారణంగా సినిమా తారలకు అభిమానులు ఉండటం అందులోనూ హార్డ్ కోర్ అభిమానులను మనం చూస్తూనే ఉంటాం. అభిమానులు అభిమాన సంఘం ఏర్పాటు చేసి తమ అభిమాన తారల సినిమాలు వస్తే.. నెలరోజుల ముందు నుంచే థియేటర్ వద్ద నానా హంగామా చేస్తూ ఉంటారు.  టాలీవుడ్ , కోలీవుడ్ బాలీవుడ్ లో ఈ అభిమానులు తమ హీరోల కోసం  దేనికైనా తెగిస్తున్నారు.  తాజాగా అందాల తార పూజా హెగ్డే కోసం ఓ వీరాభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఇంతకీ ఆ వీరాభిమాని పూజ కోసం ఏం చేసాడో తెలుసా... భాస్కర్ రావ్ అనే అభిమాని పూజా హెగ్డే అంటే ఎంతో ఇష్టం.  కొంత కాలంగా ఆమెను కలవాలని ఎలాగైనా మాట్లాడాలని ముంబయి వచ్చి ఏకంగా ఐదు రోజులు రోడ్డుపైనే పడిగాపులు కాశాడు.  పూజా హెగ్డే కోసం ఎదురు చూస్తూ.. చలికి వణికిపోతూ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.  మొత్తానికి ఈ విషయం కాస్త పూజా హెగ్డేకి తెలిసింది.  వెంటనే ఆమె అభిమాని భాస్కర్ రావు వద్దకు స్వయంగా వచ్చి..  మీ వీరాభిమానం నాకు బాగా నచ్చింది..నా మనసుకు నచ్చింది.. కానీ అభిమానులు ఇలా  ఇలా రోడ్లపై ఇలా   పడిగాపులు కావడం చలికి వణికి పోవడం ఇబ్బంది పడడం నన్ను చాలా బాధ పెట్టాయని చెప్పింది. 

 

ఇలా తన కోసం.. ఏ సినీ తారల కోసం రిస్క్ తీసుకోవొద్దు అని చెప్పిందట.  అభిమాని భాస్కర రావు తో మాట్లాడి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించింది. నువ్వు ఎక్కడున్నా.. నీ ప్రేమను ఫీల్ అవుతా.. మీకు హామీ ఇస్తున్నా ఫ్యాన్స్ నా పూర్తి బలం బాధపడుతూ ఎమోషనల్ గా షేర్ చేసింది.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: