జబర్ధస్త్ కామెడీ షోను వదిలేసి ఇప్పుడు జీ తెలుగుతో బిజీగా ఉన్నాడు నాగబాబు. ఈయన ఏడేళ్లకు పైగా నవ్వుల నవాబుగా ఉన్నా కూడా ఎందుకో తెలియదు కానీ జబర్ధస్త్ షోను వదిలేసి అదిరింది షోకు షిఫ్ట్ అయ్యారు. అయితే ఈటీవీ, మల్లెమాల సంస్థలతో విభేదాలు రావడంతో జబర్దస్త్ నుండి అదిరింది షోకు వచ్చేశారని వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం అదిరింది షోకు ఈ షోకు బుల్లితెర బ్యూటీ సమీరా షెరిఫ్ యాంకర్గా.. నాగబాబు, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. మరియు ధన్ రాజ్, ఆర్పీ, చంద్ర, వేణు టీమ్ లీడర్స్గా ఉన్నారు.
ఇక జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన తరువాత నాగబాబు ఈ అదిరింది కార్యక్రమాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ప్రమోషన్స్ బాధ్యతల్ని కూడా ఆయనే తీసుకుని కార్యక్రమానికి హైప్ వచ్చేలా చేశారు. అయితే జబర్దస్త్ను ఢీకొట్టాలని వచ్చినప్పటికీ కనీసం దానికి పోటీ కూడా ఇవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే అదిరింది షోలో మార్పులు చేస్తోంది యాజమాన్యం. జబర్దస్త్ రేటింగ్స్ని బీట్ చేయడమే టార్గెట్గా నాగబాబు తెరవెనక సీరియస్గా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కొత్త స్టార్లను రంగంలోకి దింపారు. యూట్యూబ్లో ఏ స్కిట్ పెట్టినా.. కామెంట్ల రూపంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అదిరింది షోలో పటాస్ స్టార్లను తీసుకోవాలని చాలా మంది ఆడియన్స్ కోరుతున్నారు. దీంతో గత వారం సద్దాంను అదిరింది షోలో తీసుకున్నారు. ఇక తాజాగా పటాస్ స్టార్ యాదమ్మ రాజును రంగంలోకి దింపారు. ఇప్పటికే విడుదలైన ఆదివారం ఎపిసోడ్ ప్రోమోలో సద్దాం, యాదమ రాజు స్కిట్ను చూపించారు. ఈసారి సద్దాం, యాదమ్మరాజుతో ఓ కొత్త టీమ్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రోమోలో పేల్చే కామెడీ పంచ్లకు జడ్జిలు నాగబాబు, నవదీప్ పడిపడి నవ్వారు. అయితే నాగబాబు మంచి ప్లానింగ్తో వీళ్లను అదిరింది షోకు తీసుకొచ్చారు. మరి ఈ సారైనా అదిరింది షోకి రేటింగ్స్ పెరుగుతాయా? లేదా? అనేది చూడాలి.