యువ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ఎంత మంచివాడవురా నిన్న ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శరత్ బాబు, సుహాసిని, ప్రియదర్శి, విజయ్ కుమార్ తదితరులు ఇతర పాత్రల్లో నటించగా, యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందించాడు. కుటుంబ కథలను తీసుకుని దానికి ఎమోషన్స్ ను జోడించి సినిమాలు తీయడంలో మంచి పేరున్న సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులు చాలా వరకు పెదవి విరుస్తున్నారు. శర్వానంద్ తో తీసిన శతమానంభవతి సినిమాతో హిట్ కొట్టిన సతీష్, ఆ తరువాత నితిన్ తో తీసిన శ్రీనివాస కళ్యాణం సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. 

 

ఇక ప్రస్తుతం తీసిన ఎంత మంచివాడవురా కూడా అదే దిశగా సాగె అవకాశం కనపడుతోందని సమాచారం. తాను తోడు ఎవరూ లేకుండా అనాధగా పెరగడంతో తన మాదిరిగా మిగతా వారు కూడా ఆ విధంగా ఫీల్ అవ్వకూడదని ఎమోషన్స్ ని సప్లై చేసే కంపెనీని హీరో నెలకొల్పుతాడు. అలానే సినిమాలో హీరో అన్నిటినీ కూడా ఎంతో పాజిటివ్ గా తీసుకుంటూ ముందుకు సాగుతాడు. నిజానికి అటువంటి డిఫరెంట్ పాయింట్ ని తన సినిమాకు కథగా ఎంచుకున్న సతీష్, దానిని స్క్రీన్ పై ప్రేక్షక నాడిని ఆకట్టుకునేలా తీయడంలో మాత్రం చాలావరకు విఫలం అయ్యాడని అంటున్నారు. ఎంటర్టైన్మెంట్, కొద్దిపాటి ట్విస్టులతో సాగిన ఫస్ట్ హాఫ్ పర్వాలేదని, ఆ తరువాత మొదలైన సెకండ్ హాఫ్ చాలావరకు బోరింగ్ గా సాగుతుందని, కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయని అంటున్నారు. సినిమాలో కళ్యాణ్ రామ్

 

మెహ్రీన్ జంట ఎంతో బాగుందని, ఇక హీరోగా కళ్యాణ్ రామ్ తన క్యారెక్టర్ లో ఎంతో ఒదిగిపోయి నటించాడని అంటున్నారు. ఇక సినిమాలో కీలక పాత్రలైన శరత్ బాబు, సుహాసినీలు ఆకట్టుకునే నటన కనబరిచినట్లు చెప్తున్నారు. థియేటర్ లో రెండు సాంగ్స్ బాగున్నాయని, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్, ఫైట్స్ బాగున్నాయని, అయితే పండుగ సీజన్ కావడంతో ఈ రెండు రోజుల తరువాత సినిమాకు చాలా వరకు కలెక్షన్ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి తాము దర్శకుడు సతీష్ పై పెట్టుకున్న ఎన్నో ఆశలను ఆయన అడియాశలు చేసి ముంచేసాడని కొందరు నందమూరి ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: