ఈ మధ్య నాగబాబు అనవసరంగా అడ్డంగా బుక్కైపోతున్నారు పాపం. ఏ చిన్న ఛాన్స్ దొరికినా ట్రోలర్స్ , నెటిజన్స్ వదలడం లేదు. వాస్తవంగా ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో మాజీ సీ.ఎం చంద్ర బాబు నాయుడు సుపుత్రుడు లోకేష్ నే ట్రోలింగ్ స్టార్ అనుకుంటున్నారంతా. అయితే ఆ బాబుని మించి నాగబాబుని ట్రోల్ ఎక్కువగా చేస్తున్నారు నెటిజన్లు. నాగబాబు వీడియో పోస్ట్ చేసినా, ట్వీట్ చేసినా అది విపరీతంగా ట్రోల్ అవుతోంది. జనసేన పరాజయం తర్వాత బాబు మీద ట్రోలింగ్ ఇంకా ఎక్కువైంది. పవన్ కల్యాణే సీజన్డ్ పొలిటీషియన్ అనుకుంటే.. అన్ సీజన్డ్ గా రాజకీయాల గురించి మాట్లాడుతూ విమర్శలకు గురవుతున్నారు నాగబాబు గారు. తాజాగా ఆయన వైసీపీపై చేసిన 'ఉసురు' ట్వీట్ మరింత వైరల్ గా మారింది. 

 

రైతులంటే వైసీపీకి చులకన అని, వారి ఉసురు పోసుకోవడం వల్లే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీపై దెబ్బపడిందని, అందరికీ అలాంటి శాస్తే జరుగుతుందని ట్వీటారు. అయితే ఈ ట్వీట్ కి పృథ్వీని వ్యతిరేకిస్తూ కామెంట్లు రాకపోగా.. నాగబాబునే విపరీతంగా ఆడుకున్నారందరు. పృథ్వీ తప్పుచేసి, జగన్ ఆగ్రహానికి గురయ్యారని.. అంతేకాని ఉసురు తగలడం ఏంటని రియాక్ట్ అవుతున్నారు. అంతేకాదు ప్రజారాజ్యం పేరుతో కార్యకర్తల ఉసురు పోసుకున్న చిరంజీవికి ఏం జరగాలి అంటూ ప్రశ్నించారు ఇంకొందరు. ఢిల్లీలో మీ తమ్ముడు బీజేపీ కాళ్లు పట్టుకున్నారు, ముందు ఆ సంగతి చెప్పండని ఇంకొంతమంది రౌండప్ చేశారు. జనసేన డ్రామా అయిపోయింది కదా, మళ్లీ జబర్దస్త్ ట్రై చేసుకో, మల్లెమాల వాళ్లకి బీజేపీ నుంచి రికమండేషన్ చేయించుకోమంటూ కొంతమంది బాబుకి సలహాలిచ్చారు.

 

ఇలా నాగబాబుని తీవ్ర విమర్శలతో చక చకా కడిగిపడేశారు. పృథ్వీ పేరు చెప్పి వైసీపీని టార్గెట్ చేయాలని చూసి చివరికి తానే నెటిజన్లకు టార్గెట్ అయ్యారు మెగా బ్రదర్. గతంలో కూడా ఈయన వెటకారానికి పెట్టిన ట్వీట్లు చివరకు ఆయనకే బెడిసి కొట్టాయి. విజయసాయిరెడ్డిని వేలెత్తి చూపించాలనుకుని, తన ఫ్యామిలీ హీరోలను తానే తిట్టించారు నాగబాబు. అంతేకాదు అన్ని సంవత్సరాలు జడ్జ్ గా ఉన్న జబర్దస్త్ షో ని తక్కువచేసి మాట్లాడి తనకి కాస్త కూడా కృతజ్ఞత లేదని అనిపించుకున్నారు. ఇక విపరీతంగా ట్రోల్ర్స్ కి గురయ్యో నారా లోకేష్ కే పోటీ వచ్చి ఆయన్నే మించిపోయారు నాగబాఉ. ఈ దెబ్బ గట్టిదే పాపం. 

మరింత సమాచారం తెలుసుకోండి: