అనీల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ 11 న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే రాబడుతోంది. తన సూపర్ స్టార్ స్టామినా ఏంటో ఈ సందర్భంగా మళ్ళీ రుజువవుతోంది. మహర్షి వంటి సూపర్ సక్సస్ తర్వాత వచ్చిన సరిలేరు మళ్ళి మహేష్ హిట్ సినిమాల లిస్ట్ లోకి వెళ్ళడం ఖాయమని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. 

 

ఇక ఈ సినిమా సక్సెస్ ని చిత్ర యూనిట్ బాగా ఎంజాయ్ చేస్తోంది. హిట్ టాక్ వచ్చినా.. చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలతో ఇంకా అంతటా సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకుడు అనీల్ రావిపూడి.. మహేష్ కి చదివి వినిపించాడు. అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు మహేష్ కూల్ గా సమాధానమిచ్చాడు. తన తదుపరి సినిమాలో పోకిరి మహేష్ యాటిట్యూడ్ అండ్ ఇంటెన్స్ కావాలని ఓ అభిమాని కోరగా.. దానికి సమాధానంగా కచ్చితంగా భవిష్యత్తులో పోకిరి వంటి గొప్ప సినిమాలను చేద్దామని..ఇంకా చెప్పాలంటే పోకిరి సినిమాని మించి చేద్దామని సమాధానమిచ్చాడు సూపర్ స్టార్.

 

అంతేకాక సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్ లో శేఖర్ మాస్టర్ డాన్స్ బాగా కంపోజ్ చేశారని.. ఇక నుండి ప్రతీ సినిమాకి శేఖర్ మాస్టర్ నే కొరియోగ్రాఫర్ గా తీసుకోవాలని మరో ఫ్యాన్ సజెస్ట్ చేశాడు. అందుకు మహెష్.. తప్పకుండా తన సినిమాలో కనీసం రెండు పాటలకు శేఖర్ మాస్టర్ తో కలిసి పని చేస్తామని మహేష్ మాటిచ్చాడు. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటి వరకు శేఖర్ మాస్టర్ ... మెగాస్టార్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రాం చరణ్ ..ఇలా అందరికీ సూపర్ హిట్ సాంగ్స్ కి డాన్స్ కంపోజ్ చేయడం ఆ సాంగ్స్ సూపర్ హిట్ అవడం తెలిసిందే. ఇక మహెష్ ఇప్పటి నుండి తన ప్రతీ సినిమాలో రెండు సాంగ్స్ ఉండేలా చూస్తా అనడం నిజంగా శేఖర్ మాస్టర్ కి మంచి ఛాన్స్ అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: