మామూలుగానే సినిమా ల్లో నటిస్తున్న ముద్దు గుమ్మలు ప్రేమ లో పడటం.. కొద్ది రోజులు ఎంజాయ్ చేయడం.. చేసి గుట్టు చప్పుడు కాకుండా అన్నీ చేసు కోవడం ఎక్కడైనా మీడియా కు దొరికి తే అప్పుడు మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఏదోక కల్లుబొల్ల మాటలు చెప్పి మాట చాటేస్తుంటారు.. అలా సినిమాల్లో కన్నా రోజుకో వార్త తో వార్తల్లో నిలుస్తూ బాగా ఫేమస్ అవుతున్నారు..

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  తో జోడీ గా ముకుందా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకు లకు పరిచయమైంది.. అలా ఆ సినిమా ఈమెకు అంత పేరును తీసుకు రాక పోయిన కూడా ఆమెకు వరుస సినిమా అవకాశాల ను అందిస్తున్నాయి. అందుకే ఈ అమ్మడు వరుస సినిమాల లో నటిస్తూ వస్తుంది..వరుస హిట్లతో దూసుకు పోతుంది.. 

 

అందు లో భాగం గా అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్‌ గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో క్యూట్‌గా మైమరి పించింది. మహేష్‌ బాబు తో కలసి 'మహర్షి'లో చేసి మంచి హిట్ అందుకుంది. ఇటీవల వరుణ్‌ తో మరో సారి ఆడిపాడింది. తాజాగా పూజా హెగ్డే అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురము లో నటించింది. 

 

త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుక గా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ తో అదర గొడుతోంది. అది అలా ఉంటే పూజా హెగ్డే ఓ స్టార్ హీరో ప్రేమ లో పడిందని తెలుస్తోంది. గత సంవత్సరం హిందీ లో వచ్చిన 'బజార్' చిత్రంతో పాపులరైన సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ వినోద్ మెహ్రా తో పూజా హెగ్డే ప్రేమలో పడిందా? ఎవరితో నైనా డేట్ లో ఉందా అనే ఆలోచనలు మొదలయ్యాయి.. చూడాలి ఏమౌతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: