తెలుగు బుల్లితెర పై వస్తున్న జబర్దస్త్ కామెడీ షో కార్యక్రమం మొదలై ఏడు సంవత్సరాలు దాటినా క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. ప్రతివారం కొత్త కొత్త  స్కిట్స్ తో జబర్దస్త్ కమెడియన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం మొదలై ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు అవుతున్నా.. అప్పుడప్పుడు జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు,  రోజాలు గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిపై ఎన్నో రూమర్లు వచ్చాయి.   జబర్దస్త్ నుంచి నాగబాబు,  రోజా అవుట్ అని వారి ప్లేస్ లో కొత్త వారు వస్తున్నారని పుకార్లు షికార్లు చేసేవి.. కానీ అనుకోకుండా మళ్లీ జడ్జి సీట్లో మళ్లీ వారిద్దరే ప్రత్యక్షమయ్యే వారు.

 

 ఈ మధ్య జబర్దస్త్ నుంచి నాగబాబు వైదొలిగిన విషయం తెలిసిందే.  జీ తెలుగు నిర్వహిస్తున్న ‘అదిరింది’ కాంబినేషన్లో ఆయన ప్రస్తుతం జడ్జిగా వ్యవహరిస్తున్నారు.  అయితే నాగబాబు బయటకు రావడంతో జబర్దస్త్ పై రకరకాల అనుమానాలు మొదలయ్యాయి.   జబర్దస్త్ నుంచి వచ్చిన టీం తో పాటు మరి కొంత మంది ఆయన వెంట నడుస్తానని ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. అయితే నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు ఎందుకు వచ్చారో అన్న విషయం మీడియా సాక్షిగా తెలిపిన విషయం తెలిసిందే.  జబర్దస్త్ లో తనదైన కామెడీ మార్కు చాటుకుంటున్న హైపర్ ఆది తాజాగా ప్రకాశం జిల్లా ఆయన సొంత గ్రామానికి పండుగ సందర్భంగా వెళ్లారు.

 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జబర్దస్త్ నుండి నాగబాబు బయటకు వచ్చినప్పటికీ  ఆయన  ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారని.. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను అని.. ఆయనకు ఎంతగానో విలువు ఇస్తామని అన్నారు.  ఆయన జబర్ధస్త్ టీమ్ లో అందరికీ బాగా చేయాలని ఎంకరేజ్ చేస్తూ మెసేజ్ లు కూడా పెడతారని అన్నారు.   కాకపోతే నాగబాబు జబర్దస్త్ ఎందుకు వచ్చాడో అనే విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: