తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మీక కలిసి జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.. ఈ చిత్రం నుండి విడుదల అయిన అన్నీ సినిమాపై భారీ అంచనాలు అందుకున్నాయి.. అందుకనే ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ ను అందుకుంది కాగా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల అయింది..
ఎప్పుడెప్పుడా అని ఎదుుచూస్తున్న అభిమానుల కోసం ఈ చిత్రం ఈరోజు ఈ చిత్రం విడుదలైంది.. ముందుగా అనుకున్న విధంగా ఈ చిత్రం మంచి హిట్ నీ అందుకుంటుంది అని మహేష్ అభిమానులు అభిప్రపడ్డారు.. ఇంకా ఈ సినిమా కూడా అలానే ఉంది.. అదిరిపోయే రేంజులో ఈ సినిమా కలెక్షన్స్ తీసుకుంది.. ఎటు చూసినా మొత్తానికి ఈ సినిమా బొమ్మ అదిరిపోయే రేంజులో హిట్ అయిందని చెప్పాలి..
అసలు విషయానికొస్తే.... కెప్టెన్ అఫ్ ది షిప్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. రాను రాను ఈయన సినిమాల్లో కథ అనేది కొరవడుతోంది. అది ఈ ‘సరిలేరు నీకెవ్వరు’లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వెరీ వెరీ సింపుల్ లైన్ ని కథగా తీసుకున్నారు. అందుకే క్లైమాక్స్ కి వచ్చేసరికి కథ ఏం లేక సినిమా తేలిపోయింది. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టుకొని కథనంతో మేనేజ్ చేసుకుంటూ వచ్చిన విధానం బాగుంది. అందుకే మహేష్బాబు హీరోయిజమే సినిమాను హైలెట్ చేసిందే కాని అనిల్ రావిపూడి కథ, కథనాలు కాదు..
ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా చూసిన ప్రేక్షకులంతా మహేష్ బాబు చాలా కొత్తగా కనబడ్డారని చెబుతున్నారు. నటనలో, డ్యాన్సుల్లో మహేష్ జోష్ హైలెట్ అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ‘మైండ్ బ్లాక్’ పాటలో మహేష్ మూమెంట్స్ అభిమానుల్ని విపరీతంగా అలరించాయి.ఇకపై మహేష్ ప్రతి సినిమాలో ఇలాంటి పాట ఒకటి ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో కోరుతున్నారు. అంతేకాదు మైండ్ బ్లాక్ పాటను కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ తో ఇకపై కూడా పనిచేయాలని ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుని కోరారు. మహేష్ సైతం శేఖర్ మాస్టర్ మంచి డ్యాన్సులు కంపోజ్ చేశారని, ఇకపై ప్రతి సినిమాకు ఆయనతో కలిసి పనిచేస్తానని అన్నారు.