గ్యాంగ్ లీడర్ తరువాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం వి నిన్నటి తో షూటింగ్ పూర్తి చేసుకుంది. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తుండగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అతి త్వరలో ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ విడుదలకానుందని సమాచారం.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో నివేధ థామస్ , అధితి రావ్ హైదరి కథానాయికలు నటిస్తున్నారు. ఉగాది కానుకగా
మార్చి 25న ఈ చిత్రం విడుదలకానుంది.
తన 25వ చిత్రంగా వస్తున్న ఈ వి పై నాని భారీ ఆశలు పెట్టుకున్నాడు. కాగా మోహన్ కృష్ణ -నాని కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన అష్టా చమ్మా, జెంటిల్ మన్ చిత్రాలు సూపర్ హిట్లు అయ్యాయి. మరి ఈ వి తో ఈజోడి హ్యాట్రిక్ కొడతారో చూడాలి.
ఇక ఈ చిత్రంతో పాటు నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీష్ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈచిత్రంలో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ఇక శివ నిర్వాణ -నాని కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన నిన్ను కోరి సూపర్ హిట్ కావడంతో టక్ జగదీష్ పై మంచి అంచనాలు వున్నాయి.