విజయ్ దేవర కొండ, రష్మిక.. గీత గోవిందం సినిమాతో ఈ జోడీ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ చిన్న సినిమాగా విడుదలై వంద కోట్ల క్లబ్ లో చేరిందీ సినిమా.. ఈ సినిమాలలో విజయ్, రష్మికల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. అందుకే డియర్ కామ్రేడ్ లోనూ ఈ జంటను నిర్మాతలు రిపీట్ చేశారు. అయితే ఆ సినిమాలో కూడా వీరి మధ్య కెమిస్ట్రీ బాగానే వచ్చింది. సినిమా విజయవంతం కాకపోయినా.. వీరి జంట మాత్రం కనువిందు చేసింది.

 

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవర కొండ గురించి రష్మిక ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఆమె ఏం చెప్పిందంటే.. “ కొత్తవాళ్లతో పనిచేసినపుడు ఎవరికైనా చిన్న బిడియం ఉంటుంది. ‘గీత గోవిందం’ సమయంలో విజయ్‌తోనూ అలానే అనిపించింది. కానీ తనది ఫ్రెండ్లీ నేచర్‌. రెండోరోజు నుంచే తనతో పనిచేయడం సులభంగా అనిపించింది. సినిమా మధ్యలోనే మేం ఫ్రెండ్స్‌ అయిపోయాం.

 

ఇక ‘డియర్‌ కామ్రేడ్‌’కి పనిచేసినపుడు తను ఏ సందర్భంలో ఎలా స్పందిస్తాడో అర్థమయ్యేది. దాంతో సీన్లు సహజంగా చేయగలిగాం. విజయ్‌ హార్డ్‌వర్కర్‌. అనుకున్నది సాధించేవరకూ రాజీ పడడు. మా పరిచయానికి ముందు నటుడిగా తనంటే గౌరవం ఉండేది. తనతో కలిసి ప్రయాణించాక వ్యక్తిగా ఆ గౌరవం ఇంకా పెరిగింది. తన నుంచి చాలా నేర్చుకున్నాను అంటోంది రష్మిక మందన్న.

 

రష్మిక మందన్న తక్కువ సమయంలో ఎక్కువగా పాపులర్ అయ్యిందీ హీరోయిన్.. కేవలం రెండేళ్లు.. నాలుగు సినిమాలతోనే దూసుకుపోయింది. రష్మిక గురించి చెప్పాలంటే.. ఈ రెండు ముక్కలు చాలు.. అలా తారాపథంలో దూసుకెళ్లిందీ తార. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్ పక్కన అలరించింది. సినిమా సక్సస్ తో మరోసారి లక్కీ హీరోయిన్ అయ్యింది. అయితే సినిమాలో రష్మిక పాత్ర మరీ ఓవర్ గా ఉందన్న కామెంట్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: