ఒకవైపు చిరంజీవి తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ ఇండస్ట్రీలో తాను అందరివాడిని అని సంకేతాలు ఇవ్వడానికి ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చి మహేష్ పై అతడి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పై ప్రశంసలు కురిపించి మహేష్ అభిమానుల అభినందనలు పొందాడు. అయితే ప్రస్తుతం రాజకీయాలలో ఉంటూ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటున్న పవన్ కళ్యాణ్ చేసిన ఒక చిన్న పొరపాటు మహేష్ అభిమానులకు విపరీతమైన కోపాన్ని తెప్పిస్తోంది.

‘అల వైకుంఠపురములో మూవీకి సక్సస్ టాక్ వచ్చిన నేపధ్యంలో పవన్ బన్నీకి అదేవిధంగా ఆసినిమా దర్శకుడు త్రివిక్రమ్ కు సంగీత దర్శకుడు తమన్ కు సంక్రాంతి సందర్భంగా ఫ్లవర్ బొక్కేలు పంపి అభినందనలు తెలియచేసాడు. ఇప్పుడు పవన్ వీరికి పంపిన సంక్రాంతి ఫ్లవర్ బొక్కేల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

ఈవిషయం మహేష్ అభిమానుల దృష్టి వరకు రావడంతో వారు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. సంక్రాంతి వార్ కు రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీలు రెండు విజయం సాధించాయి అని ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఓపెన్ గా చెపుతున్న నేపధ్యంతో పాటు ‘సరికేరు’ మూవీ కలక్షన్స్ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలక్షన్స్ ఇంకా సంతృప్తికరంగా ఉన్న పరిస్థితులలో ఇంతమందికి ఫ్లవర్ బొక్కెలు పంపిన పవన్ ఒక ఫ్లవర్ బొక్కేను పెద్ద మనసు చేసుకుని మహేష్ కు కూడ పంపి ఉంటే బాగుండేది కథా అంటూ ప్రశ్నలు వేయడమే కాకుండా అలా చేసి ఉంటే పవన్ సంస్కారం తెలిసి ఉండేది అంటూ మహేష్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

అంతేకాదు ఈమధ్య సాయి ధరమ్ నటించిన ‘ప్రతిరోజు పండగే’ మూవీ సక్సస్ అయినప్పుడు కూడ పవన్ ఇలా తేజ్ కు ఫ్లవర్ బొక్కెలు పంపిన విషయాన్ని గుర్తుకు చేస్తూ పవన్ కళ్యాణ్ కు ఒక్క మెగా హీరోల విజయం తప్ప మరి ఏ కుటుంబ హీరోల విజయం కనిపించదా అంటూ మహేష్ అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ‘సరిలేరు నీకెవ్వరు’ కేవలం మూడు రోజులలో 103 కోట్ల గ్రాస్ వసూలు అయిన విషయం పవన్ కు తెలియదా అంటూ ప్రశ్నలు అడుగుతూ పవన్ ను కార్నర్ చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: