మహేష్ అల్లు అర్జున్ ల మధ్య జరిగిన సంక్రాంతి వార్ విన్నర్ ఎవరు అన్న విషయమై సగటు ప్రేక్షకుడు స్పష్టమైన తీర్పు ఇచ్చినా వీరిద్దరి అభిమానుల మధ్య అదేవిధంగా వీరి సినిమాల నిర్మాతల మధ్య లేటెస్ట్ గా జరుగుతున్న రియల్ విన్నర్ ఫేక్ విన్నర్ వార్ ల కామెంట్స్ మరింతగా మహేష్ బన్నీ ల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. ‘అల వైకుంఠపురములో’ నిర్మాతలు త‌మ సినిమా సంక్రాంతి విన్న‌ర్ అని త‌మ సినిమా విడుద‌ల అయిన మ‌రుస‌టి రోజే ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకుంది. 

అంతేకాదు మీడియాకు ఇచ్చే యాడ్స్ లో కూడ 'సంక్రాంతి విన్న‌ర్' అంటూ త‌మ సినిమాకు ట్యాగ్ ను త‌గిలించారు. దీనికి ముందే ఇలాంటి ప్రచారాన్ని ఊహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ ‘బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ వదిలిన ఒక ప్రచార పోష్టర్ కు ‘అల వైకుంఠపురములో’ టీమ్ ఇలాంటి సమాధానం ఇచ్చింది అని సరిపెట్టుకున్నా సంక్రాంతి పండుగ ఇంకా పూర్తి కాకుండానే ఈ సంక్రాంతి విన్నర్ ప్రచారంలో ‘అల’ టీమ్ తొందర పడింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనికితోడు మహేష్ అల్లు అర్జున్సినిమా నిర్మాతలు ప్రచారంలోకి తీసుకువస్తున్న కలక్షన్స్ ఫిగర్స్ ఏవీ నిజం కావని అన్న ప్రచారం మొదలైంది. ‘సరిలేరు’ కన్నా ‘అల’ మూవీ పై సగటు ప్రేక్షకుడు స్పందన బాగానే ఉన్నా బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ కి ‘అల వైకుంఠపురములో’ చేరుతుందా లేదా అన్న విషయమై క్లారిటీ రావాలి అంటే ఈ వీకెండ్ ముగిసిన తరువాత వచ్చే సోమవారంనాడు ‘అల’ కు వచ్చే కలక్షన్స్ బట్టి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవునా కాదా అన్న విషయం తెలుస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు.

దీనికితోడు ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు నిన్న ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ అల్లు అర్జున్ ల మూవీలు రెండు కూడ 100 కోట్ల నెట్ కలక్షన్స్ రేంజ్ కి చేరుకుంటాయని కొద్దిగా ‘సరిలేరు’ పై ‘అల’ డామినేషన్ కొనసాగుతున్నా పూర్తిగా మహేష్ సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నట్లు కాదని కామెంట్ చేసాడు. ఈ కామెంట్స్ ను ఆధారంగా చేసుకుని మహేష్ అభిమానులు మరింత రేచ్చిపోతు సంక్రాంతి రియల్ విన్నర్ ఫేక్ విన్నర్ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ బన్నీ అభిమానులను రెచ్చకొడుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: