ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మికా మాందన్నా.. ఆ సినిమా మంచి హిట్ నీ అందుకోవడంతో.. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. అందుకే ఈ అమ్మడిని లక్కీ లెగ్ అని అంటారు .విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం సినిమాలో నటించింది.. ఆ సినిమా కూడా ఘన విజయం అందుకోవడంతో డియర్ కామ్రేడ్ సినిమాలో మళ్లీ విజయ్ సరసన జత కట్టింది..

 

ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా నటిస్తూ ప్రేక్షకుల ను మెప్పిస్తో వస్తుంది..సినిమా సినిమాకు అందాల డోస్ పెంచుతూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తుంది..యంగ్ హీరోలతో ఇంత కాలం జోడీ కట్టిన రశ్మిక తొలి సారి మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో `సరిలేరు నీకెవ్వరు`లో సరసాలాడింది. అయితే ఈ మూవీలో ఈమె క్యారెక్టర్ పై మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. 

 

 

ఈ సినిమాలో  పదే పదే హీరో మీద పడిపోవటం కాస్త ఓవరైందని క్లాస్ ఆడియన్స్ ఫీలవుతున్నారు. మరికొందరు రశ్మిక మ్యానరిజమ్స్, మాడ్యులేషన్స్ కొత్తగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే, క్యారెక్టరైజేషనే కాదు... 'మైండ్ బ్లాంక్' సాంగ్‌లో ఈ క్యూట్ లేడీ నాటుగా చెలరేగిందని కూడా కొందరు పెదవి విరుస్తున్నారు. మాస్ ఆడియన్స్ కళ్లప్పగించి చూస్తారని పాటలో గ్లామర్ బాగా పొంగించింది రశ్మిక. అది కాస్తా డీసెంట్ ఆడియన్స్ లోని ఓ వర్గానికి షాక్ గా మారిందట..

 

ప్రస్తుతం హీరోయిన్స్ రేసులో నిలబడాలంటే ఎవరైనా కాస్త స్కిన్ షో చేయక తప్పదని అనేవారు లేకపోలేదనుకోండి. మరి, రశ్మిక ఈ విమర్శల్ని సీరియస్ తీసుకుంటుందా? హోమ్లీగానే ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తుందా? అని అందరూ అంటున్నారు.. ఇకపోతే మైండ్ బ్లాక్ సినిమాలో ను ఆ పాటకు వేసిన స్టెప్పులు సినిమాకు హైలెట్ అయింది.. ఆ పాటే సినిమాకు మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది.. అందులో అమ్మడు అందం ఎక్కువ ఉంది కాబట్టి సినిమా హిట్ అయిందని అందరూ అంటున్నారు.. ఇప్పుడు బన్నీ సరసన సుకుమార్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తుంది..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: