అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో బన్నీ తన దృష్టి తర్వాతి సినిమాపై పెట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీసినిమా చేయబోతున్నాడని తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం అల వైకుంఠపురములో ఆనందాన్ని అనుభవిస్తున్న బన్నీ ఫిబ్రవరిలో ఈ షూటింగ్ లో పాల్గొంటాడట.

 

 

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువ మంది కొత్తవాళ్ళే కనిపిస్తారట. చిత్తూరు ప్రాంతానికి చెందిన నటులని తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు సమాచారం. ఆ పాత్ర విలన్ పాత్ర అయ్యుంటుందని అనుకుంటున్నారు. విజయ్ సేతుపతి సోలో హీరోగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు.

 

 

గత ఏడాది విడుదలైన భారీ బడ్జెట్ మూవీ సైరా లో ఆయన తమిళనాడు ప్రాంతానికి చెందిన ఓ వీరుడి పాత్ర చేశారు. ఇప్పుడు సుకుమార్ సినిమాలో విలన్ పాత్ర దక్కడం విశేషం. అటు తమిళంలో హీరోగా సినిమాలు చేస్తూ.. తెలుగులో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ రెండు చోట్ల మార్కెట్ పెంచుకుంటున్నాడు. అయితే ఈ పాత్ర గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. మరి ఈ సినిమా తర్వాత విజయ్ సేతుపతికి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు.

 

 

ఇక ఈ సినిమా రివేంజ్ డ్రామా అన్న సంగతి తెలిసిందే... ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: