ప్రస్తుతం పూజ హెగ్డే మ్యానియా కొనసాగుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘అల వైకుంఠపురములో’ ఆమె గ్లామర్ కు మాత్రమే నటనకు కూడ మంచి మార్కులు పడటంతో ఇప్పుడు టాప్ హీరొయిన్ రేస్ లో ముందు స్థానంలో కొనసాగుతోంది. ఈమె నటించిన బాలీవుడ్ మూవీ ‘హౌస్ ఫుల్ 4’ కూడ బాలీవుడ్ లో సూపర్ సక్సస్ కావడంతో ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా పూజ హెగ్డే పై ఉంది. 

సాధారణంగా తాను నటించే సినిమాల హీరోయిన్స్ విషయంలో పెద్దగా ఎటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేయని పవన్ కళ్యాణ్ కూడ తన ‘పింక్’ రీమేక్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే బాగుంటుంది అని సూచనలు చేసాడు అంటే ఆమె రేంజ్ ప్రస్తుతానికి ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఆమెను చూడటానికి ముంబాయి వెళ్ళి ఆమెను కలవలేక తరిగి రావడం ఇష్టం లేక ముంబాయిలోని ఫుట్ పాత్ పై పడుకున్న ఒక వీరాభిమాని గాథ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. 

ఆ వీరాభిమాని పేరు భాస్కర్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ వీరాభిమాని ముంబాయి వెళ్ళి తనను కలవలేక ఫుట్ పాత్ పై పడుకుంటున్నాడు అన్న విషయం పూజ దృష్టి వరకు వెళ్ళింది. దీనితో ఆమె తన సహాయకులను పంపించి అతడిని తన ఇంటి వద్దకు పిలిపించుకుని అతడితో మాట్లాడి అతడు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవడానికి టిక్కెట్ కొని ఇచ్చి తన మంచి మనసును చాటుకుందట.

ఈ విషయానికి సంబంధించి ఆ వీరాభిమానితో పూజ తీయించుకున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారడంతో పూజ అభిమానులు అంతా ఆమె మంచితనం పై ప్రశంసలు కురిపిస్తూ ఈ ఫోటోను ఒకరికొకరు షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: