సినీ విమర్శకుడు కత్తి మహేష్ పేరు పరిచయం అక్కర్లేని పేరు.. సినిమా విడుదలవుతోంది అంటే విమర్శల  బుల్టెన్ తో ఈయన రెడీగా ఉంటాడు.. అయితే ఆయనకు నచ్చితే మాత్రం ఆ హీరో సినిమాను ఆకాశానికి నిచ్చెనలు వేసేలా ప్రమోట్ చేస్తాడు.. ఒకవేళ నచ్చక ఆ సినిమా హిట్ అయినా కూడా మహేష్ మాటల యుద్దం చేస్తూనే ఉంటాడు..ఇక ఈయన కు పవన్ కళ్యాణ్ కు పచ్చ గడ్డి వేస్తే బగ్గు మంటుందన్న విషయం తెలిసిందే.. 

 

తాజాగా పవన్ కళ్యాణ్ జనం సమస్యల కోసం కాకినాడ వస్తాను తెలుసుకుంటాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై..ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన తీవ్ర వ్యాఖ్యలు జనసైనికుల్లో ఆగ్రహం తెప్పించాయి.దీంతో ద్వారంపూడి ఇంటిని ముట్టడించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి గాయాలపాలయ్యారు. అయితే తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పవన్ కళ్యాణ్‌కి ఆగ్రహం తెప్పించింది..

 

పవన్ కళ్యాణ్ ఏం చేసినా విమర్శించే వ్యక్తుల్లో ముందు ఉండే కత్తి మహేష్ ఈ ఇష్యూపై సెటైర్లు వేస్తున్నారు. ప్రభుత్వంతో తేల్చుకుంటా.. అది చేస్తా ఇది చేస్తా అని డైలాగ్‌లు పేల్చిన పవన్‌ ఏం చేశారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాకినాడలో జనసేనాని ఉగ్రరూపం చూసి నాలుగు అడుగులు వెనక్కి వెళ్లిన సముద్రం. నేలకి ఒంగిన ఆకాశం. పది అడుగులు కృంగిన భూమి. అమరావతి రాజధాని కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్న జనసేనానికి అభినందనలు’ అంటూ వరుస పోస్ట్‌లు చేసి జనసైనికుల్ని మరింత రెచ్చగొడుతున్నాడు కత్తి.

 

అసలు విషయానికొస్తే.. జనాసేన నాయకుడి పై ఎవరో దాడి చేశారు.. కాగా ఆ ఫోటో సోషల్ మీడియా లో రచచేస్తుంది.. ఈ విషయం పై కత్తి సేటైర్లు వేశాడు.. అలా పవన్ తో ఉంటే రక్తం కారక ఇంకేం కారుతుందిలే అంటూ విమర్శలు గుప్పించాడు.. మరో సారి ట్రైల్స్ వేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు..ఈ చర్చ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: