టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాకు ఐటీ షాక్ తగిలింది. ఐటీ అధికారులు కర్ణాటకలోని కూర్గ్ లో రష్మిక నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గత సంవత్సర కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రష్మిక ఒక వెలుగు వెలుగుతోంది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రష్మిక మందన్నా మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
 
అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా రష్మిక నటించనుంది. కన్నడలో, తెలుగులో, తమిళంలో చాలా సినిమాలలో నటించిన రష్మిక ఆదాయపు పన్ను లెక్కలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రష్మిక ఇప్పటివరకు ఏయే సినిమాల్లో నటించింది...? నటించిన సినిమాలకు ఎంత పారితోషికం తీసుకుంటుంది..? ఆ సినిమాలో హిట్లు ఎన్ని..? రెమ్యూనరేషన్ పన్ను చెల్లింపు సరిగ్గా చేశారా..? లేదా..? అనే వివరాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
కన్నడలో కిర్రాక్ పార్టీతో హీరోయిన్ గా రష్మిక కెరీర్ మొదలుపెట్టింది. చలో, గీతా గోవిందం హిట్లు కావడంతో స్టార్ హీరోల సరసన రష్మికకు అవకాశాలు వస్తున్నాయి. ఈరోజు ఉదయం నుండి ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కోటి రూపాయలకు పైగా రష్మిక రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఐటీ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
 
తన ఇంట్లో సోదాలు జరుగుతున్న విషయం తెలియటంతో రష్మిక హుటాహుటిన హైదరాబాద్ నుండి కర్ణాటకలోని కూర్గ్ కు ప్రయాణమైనట్టు తెలుస్తోంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఐటీ సోదాలు జరగడం రష్మికకు షాక్ అనే చెప్పవచ్చు. సోదాలు పూర్తయిన తరువాత ఐటీ అధికారులు సోదాలకు సంబంధించిన వివరాలను తెలిపే అవకాశం ఉంది. జాతీయ మీడియాలో రష్మిక ఇంటిపై ఐటీ దాడులకు సంబంధిన కథనాలు వెలువడుతున్నాయి. రష్మిక తన ఇంట్లో జరుగుతున్న ఐటీ సోదాల గురించి ఇంకా స్పందించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: