నటషా 2006లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా మిస్‌ వరల్డ్‌ పోటీలో టాప్‌-10లో  ఆమె నిలిచారు. ఆ తరువాత 2016లో వచ్చిన మలయాళ  ‘కింగ్‌ లయర్‌’  చిత్రంలో నటించడమే కాకుండా, కొన్ని వెబ్‌ సిరీస్‌లలో కూడా నటించారు. ఇక మోడల్‌, మాజీ ఫెమినా మిస్‌ ఇండియా అయినా నటషా సూరి ఈ మద్య అంతర్జాలంలో తన పై ఎవరో కావాలనే చెడు ప్రచారం చేస్తున్నారని వాపోతుంది.

 

 

ఈ విషయంలో ముంబై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు... ఇక ఫ్లిన్‌ రెమెడియోస్‌ అనే వ్యక్తి తన పేరుతో అభ్యంతరకర వార్తలను ప్రచురిస్తూ, మానసికంగా వేధిసున్నాడంటూ, తన లాయర్‌ మాధవ్‌ వి. తోరత్‌తో కలిసి దాదర్‌ పోలీసు స్టేషన్‌లో బుధవారం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఏకంగా నటషా సూరి పేరు మీద నకిలీ ట్విటర్‌ ఖాతాలను తెరిచి... అభ్యంతరకర వార్తలకు బాత్‌రూంలో ఉన్న అసభ్యకర అమ్మాయిల ఫొటోల ముఖాన్ని బ్లర్‌ చేసి వాటికి తన పేరుతో షేర్‌ చేస్తున్నాదని,. దీన్నిబట్టి చూస్తే అతను నన్న లక్ష్యంగా చేసుకుని.. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్లుగా నాకు అర్థమైందని తెలిపింది..

 

 

అంతే కాకుండా పోర్న్‌సైట్లలో తల లేని శరీరాన్ని మార్ఫింగ్ చేసి గూగుల్‌లో ఆ ఫొటోలు తన పేరుతో ట్రోల్ చేయడం నిజంగా దారుణమైన ఘటనగా పేర్కొంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ‘2019లో నవంబర్‌లో ఎవరో నకిలీ వార్తా కథనాలను సృష్టించి వాటిని నా పేరుతో ప్రచురించడం మొదలు పెట్టారు. మొదట్లో వాటిని అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా ఇలాంటివి చాలా వచ్చాయి. ఎవరో కావాలనే ఇలా చేస్తున్నారనకున్న కానీ క్రమంగా అవి తారస్థాయికి చేరడంతో భరించలేక  ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఈ మోడల్ పేర్కొన్నారు.

 

 

ఇకపోతే బిగ్‌ బాస్‌ 13 కంటెస్టెంట్‌ సిద్దార్థ శుక్లా తనను వేధిస్తన్నట్లు..  నకిలీ వార్తలు ప్రచారం చేశారని ,అసలు ఇప్పటివరకు నేను శుక్లాను కలవనే లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు’ మరి అనవసరంగా నన్ను ఎందుకు ఈ వివాదాల్లోకి లాగుతున్నారో అర్ధం కావడం లేదని, అందుకే వీటన్నింటికీ అడ్డుకట్ట వేసెందుకే కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: