టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సరిలేరు నీకెవ్వరు మంచి కలెక్షన్ ని రాబడుతుండడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాకు తొలిరోజు కొంత మిశ్రమ స్పందన లభించింది. ఒకవైపు పండుగ కావడం, అలానే మరొకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా కారణంగా ఇప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్స్ ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. ఇక కొందరు ట్రేడ్ విశ్లేషకులు నుండి అందుతున్న సమాచారం ప్రకారం, 

 

కొన్ని చోట్ల ఈ సినిమా అప్పుడే బ్రేక్ ఈవెన్ ని అందుకుందని, అలానే మరికొద్దిరోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా ఆ రేంజ్ ని అందుకోవడంతో పాటు మంచి ప్రాఫిట్స్ కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే దీని తరువాత మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్న మహేష్ బాబు, అనంతరం తన 27వ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ, మాఫియా బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించనున్నారని, అలానే మంచి మాస్, యాక్షన్ అంశాలతో పాటు పలు కమర్షియల్ హంగులు కూడా ఈ సినిమాలో ఉండనున్నాయని అంటున్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, 

 

ఈ సినిమాకు కూడా మరొక్కసారి దేవిశ్రీప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నట్లు టాక్. ఇప్పటికే మహేష్ తో భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు సినిమాలకు వరుసగా మ్యూజిక్ ఇచ్చిన దేవిని మరొక్కసారి మహేష్ సినిమాకు తీసుకోవడంపై ఆయన ఫ్యాన్స్ నుండి విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరేమో దేవిని తీసుకుంటే న్యాయం చేస్తాడని అంటుంటే, మరికొందరు మాత్రం వరుసగా దేవినే రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాకు మరొక మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు రావలసి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: