బాహుబలి సినిమాతో  జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్.. ఆ తర్వాత సాహో సినిమా ద్వారా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయాడు. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. అయితే రిజల్ట్ మాత్రం దారుణంగా వచ్చింది.  దీంతో కాస్త నిరాశ చెందిన యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమా జాన్‌పై దృష్టి సారించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభ వేడుకను గతేడాది హైదరాబాద్‌లో నిర్వహించగా.. రెగ్యులర్‌ షూటింగ్‌ను 2018 డిసెంబర్‌ నుంచి ప్రారంభించారు.

 

ఇటీవల డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. 1970 కాలంలో సాగే ఈ మూవీ మంచి రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ అని అన్నారు.  పునర్జన్మల నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా నిర్మితమవుతోంది.  గోపీ కృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ  మూవీకి అమిత్ త్రివేదీ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎంతవరకూ వచ్చింది? ఇతర ముఖ్య పాత్రల్లో ఎవరెవరు కనిపించనున్నారు? ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేకతలు .. విశేషాలు ఏమిటి? అనే విషయాలేవీ బయటికి రాలేదు. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

 

ఈ మద్య పూజా హెగ్డే వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇవ్వమని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతుతున్నారు. అయితే దీనిపై  ఈ సినిమా అప్ డేట్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కన్ఫామ్ అయితే ఈ సినిమా గురించిన పూర్తి క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఏది ఏమైనా ఈ మూవీపై యంగ్ రెబల్ స్టార్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుగుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: