నేటితో మూడు రోజుల సంక్రాంతి పండగ ముగిసిపోనుండగా  రెబల్ స్టార్  ప్రభాస్ అభిమానులు  మాత్రం రేపు కూడా  పండగ జరుపుకోనున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రభాస్ 20వ సినిమా గురించి రేపు అధికారికంగా  అప్ డేట్ ఇవ్వనున్నారు.  సినిమా టైటిల్ లేదా షూటింగ్  గురించి  అప్ డేట్  ఇవ్వనున్నారని సమాచారం. ఇక గత ఏడాదే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ఇటలీ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు.
 
ఆతరువాత సినిమా  ను హోల్డ్ లో పెట్టాడు ప్రభాస్.  సాహో ఇచ్చిన షాక్ తో స్క్రిప్ట్ లో మార్పులు చేయించి  బడ్జెట్లో కొత్త విధించాడు. ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ ఈ నెల 20నుండి  అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగనుంది. ఈషెడ్యూల్ కోసం  అక్కడ భారీ సెట్ లను నిర్మిస్తున్నాడు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి. జిల్ ఫేమ్  రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ  చిత్రంలో పూజా హెగ్డే  హీరోయిన్ గా  నటిస్తుండగా  ప్రభాస్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ప్రభాస్ తో కలిసి నటించడం పూజా కు ఇదే మొదటి సారి. 
 
ప్రభాస్ సొంత బ్యానర్ గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సైరా ఫేమ్  అమిత్ త్రివేది  సంగీతం అందిస్తున్నాడు.  ఎలాగైనా  ఈ ఏడాది  దసరా కానుకగా అక్టోబర్ లో ఈ చిత్రాన్ని  ప్రేక్షకులముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక గత ఏడాది  సాహో తో  ప్రేక్షకులముందుకు వచ్చిన   ప్రభాస్ డిజాస్టర్ టాక్ తో కూడా 400కోట్ల వసూళ్లను రాబట్టి తన  స్టామినా ఏంటో చూపెట్టాడు. సాహో హిందీ వెర్షన్  అయితే 150కోట్ల వసూళ్లను రాబట్టి  సూపర్ హిట్ అనిపించుకుంది.  దాంతోప్రభాస్ 20పై  హిందీలో కూడా భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: